తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో బీసీలకు తగిన కేటాయింపులు లేవని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ‘కామారెడ్డి డిక్లరేషన్’ హామీలను విస్మరించిందని ఆరోపిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. హన్మకొండ ఏకాశిల పార్క్ నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు.. ఏటా 20 వేల రూపాలయ కోట్లు కేటాయించాలని, 56 శాతం జనాభాకు న్యాయం చేయాలని బీసీ సంఘాలు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బీసీ సంఘాల ఆందోళన, డిమాండ్లపై మరింత సమాచారం మా వరంగల్ కరస్పాండెంట్ కిషోర్ అందిస్తారు.
Tag: