కడప జిల్లా.. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియాన్ల నాయకులు మాట్లాడుతూ.. అంగన్వాడి కార్యకర్తలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే అంగన్వాడి కేంద్రాలను మూసివేసి ఈరోజు రోడ్డుపైకి వచ్చామని దీనికి కారణం ప్రభుత్వమేనని చెప్పారు. 30 ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలుగా పనులు చేస్తున్నామని కేవలం 11 వేల రూపాయల జీతంతో ఎలా మా కుటుంబాలు పోషించుకోవాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా వేతనం ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టోర్ డీలర్లు పౌష్టికాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద దించకుండా వీధుల వెంట పరిగెత్తిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు.
Tag:
anganawadi workers
విజయనగరం జిల్లా, సమస్యల పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల ధర్నా. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి హెచ్చరించారు. మంగళవారం గజపతినగరం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆందోళన చేపట్టారు.