ప్రైవేట్ వ్యక్తులచే టిడిపి ఓటర్ వెరిఫికేషన్ చేయించడంపై నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. ఓటిపిల సేకరణతో ఫోన్లు హ్యాకింగ్ చేసే ప్రమాదం కూడా ఉందని, గతంలో టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి అనిల్ కుమార్ గుర్తు చేశారు. ప్రభుత్వం కేటాయించిన బిఎల్ఓ లు, పార్టీల బిఎల్ఏలు మినహా ఎవరు ఓటర్ వెరిఫికేషన్ పేరుతో ఓటిపిలు అడిగిన పోలీస్ స్టేషన్ కు అప్పగించడం తథ్యం అని మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పారు.
ap politics
51 ఒకటో డివిజన్లో జరిగిన గొడవ, అరెస్టులు కేవలం టీ కప్పులో తుఫాన్ లాంటివని తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ నాయకులు సయ్యద్ ముజీబ్ అన్నారు మంగళ వారం సాయంత్రం బస్టాండ్ రోడ్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సయ్యద్ ముజీబ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వార్డు వార్డుకు ప్రచారం చేస్తూ పార్టీ బలోపేతం దిశగా కృషి చేస్తున్న తనకు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జ్ మహమ్మద్ నసీర్ తూర్పు సీటును ఆశిస్తున్నారని చెప్పి అడ్డుకోవడం అవివేకం అని అన్నారు. గత నాలుగు దఫాలుగా గుంటూరు తూర్పు నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూస్తుందని అయితే ఈ దఫ్ఫా ఎలాగైనా సరే తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో విజయం సాధించే దిశగా కృషిచేసి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు బహుమతి ఇవ్వాలని సంకల్పంతో తాము కృషి చేస్తున్నామని అన్నారు. తాము మొదటి నుంచి టీడిపి పార్టీకి వీర విధేయులుగా ఉన్నామని తన తండ్రి గతంలో సీటు ఆశించారని అయితే యువకుడు ఉత్సాహవంతుడు నసీర్ అయితే బాగుంటుందన్న అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి తాము నసీర్ కి ఎన్నికల్లో అండగా నిలబడి కృషి చేసామని అన్నారు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిబద్ధతతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో తాను కృషి చేస్తున్న అనే తప్ప, సీటు ఆశించి చేస్తున్నారు అనడం కరెక్ట్ కాదని అన్నారు. సీటు ఎవరికి ఇవ్వాలో ఇవ్వకూడదో అది అధిష్టానం నిర్ణయిస్తుందని, పార్టీ నిర్ణయానికి శిరసావహించి పార్టీ విజయానికి కృషి చేయడం ప్రతి కార్యకర్త క్రమశిక్షణ సైనికుల వలె పని చేయాల్సిన అవసరం ఆసన్నమైందని ఆయన అన్నారు. నియోజకవర్గంలో డివిజన్లు అన్నిటిలో ఓటర్ల నమోదు కార్యక్రమం తో పాటు ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమాన్ని కూడా తాను సొంత నిధులతో ఏర్పాటు చేశామని అన్నారు. తాము చేసే ప్రతి కార్యక్రమం నసీర్ కి తెలియజేస్తున్నామని అయితే ఆయన స్పందించకుండా తమపై నిరాధార ఆరోపణలు చేసి తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. టిడిపి లో తాను ఒక నాయకుడిగా కాకుండా కార్యకర్తలాగా పనిచేస్తున్నానని అన్నారు. పార్టీ పెద్దల ఆదేశాను ప్రకారమే తాను నియోజకవర్గంలో బాబుతో షురిటీ కార్యక్రమాన్ని చేపట్టానని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో తెలియజేసిన పార్టీ నాయకులు సయ్యద్ ఫిరోజ్, సయ్యద్ షబ్బీర్, లడ్డు సుభాని, మహమ్మద్ కరిముల్లా ఇంకా పార్టీ నేతలు పాల్గొన్నారు
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం కొత్తగూడెంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. వల్లభనేని అరుణ చారిటబుల్ ట్రస్టు ద్వారా 5లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆర్వో ప్లాంట్ ను వంశీ ప్రారంభించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకుడైన ప్రజలకు మంచి చేసేందుకు పని చేయాలి. అధికారంలో ఉండగా చేయలేని పనులు వేరే వారిని చూసి అంతకు మించి చేస్తానంటే ప్రజలు నమ్మరు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్ మెంట్ ద్వారా లక్షల మంది పేద కుటుంబాలలో వెలుగులు రాజశేఖర్ రెడ్డి నింపారు. అదే బాటలో సీఎం జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని పెంచాడు. వృద్ధులు, వికలాంగులు ఏనాయకుడు వద్ద పడిగాపులు పడకుండా 1వ తేదీన ఇంటివద్దనే ఫెంక్షన్ అందిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర ఏళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని అమలు చేస్తున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఒక్క సంక్షేమ పధకం కూడా ఆపలేదు. పేదలకు సంక్షేమ పథకాలు అమలులో కొన్ని అప్పులు చేయడం సహజం. గత ప్రభుత్వాలు అప్పులు చేయకుండా జేబులో డబ్బులు ఖర్చు చేశారా????? పేదలకు మంచి చేస్తుంటే కొంతమంది పప్పు బెల్లాలు లాగా పెడుతున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పెత్తందారీ విధానాన్ని మార్చడం షావుకారులకు కడుపు మంటగా ఉంది. కొన్ని పత్రికలు, టీవీ చానల్స్ ద్వారా రాష్ట్రాన్ని అప్పులుపాలు చేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ఎక్కడా కష్టం రాలేదు. కష్టం వచ్చింది కేవలం చంద్రబాబుకి మాత్రమే. ధనికులు పిల్లలు కార్పొరేట్ పాఠశాలల్లో చదివితే ఇంగ్లీష్ అర్ధం అవుతుంది. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే అర్ధం కాదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబుని నమ్మి రైతు, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని గ్రామాల్లో చెప్పి చేయలేని పరిస్థితి. రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉంటే పేద ప్రజలకు మంచి జరుగుతుంది.
2024 ఎలక్షన్లో దొంగ ఓట్లతో మళ్లీ అధికారం కోసం వైసిపి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, అదే విధంగా తిరుపతి జిల్లా పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున దొంగ ఓట్లను చేర్పించారని టిడిపి నాయకులు ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఇసుక , మఠం భూములు ,ఎర్రచందనం మాఫియా లాగా అధికారుల అండదండలతో దొంగ ఓట్ల మాఫియా చేశారని ఆరోపించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు సుగుణమ్మ, పులివర్తి నాని, నరసింహా యాదవ్ తో కలిసి దొంగ ఓట్లు పైన ఫిర్యాదు చేశారు .ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ రానున్న ఎలక్షన్ లో వైసీపీ దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు .ఇప్పటికైనా అధికారులు దొంగ ఓట్ల పైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, విజయ సాయిరెడ్డి నేతృత్వంలో పని చేసే నిబద్ధత కలిగిన కార్యకర్తల సమావేశం ఇది. పార్టీలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగిన ఏ టైం లోనైన నా దగ్గరకు రావచ్చు, వారికి నేను అండగా ఉంటాను. వైస్సార్ కుటుంభంలో ఎలాంటి సమస్యలు ఎదురైన సహించేది లేదు. అందరికి ఒకే ఫెస్ ఉంటుంది, అందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నాము. వై నాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డి ఆశయం కోసం అందరం కృషి చేయాలి.
Read Also…
Read Also…
పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీలో వర్గ విబేధాలు రోడెక్కినాయి. జ్యోతిరావు పూలే విగ్రహం వేదికగా గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. విడివిడిగా జ్యోతిరావు పూలే విగ్రహంకి వైసీపీ శ్రేణులు నివాళులు అర్పించారు. ఒక పక్క ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి వర్గం, మరో ప్రక్క గజ్జల బ్రమ్మారెడ్డి వర్గం. జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం వేదికగా వైసీపీ అసంతృప్తి నేతలకు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. నా వల్ల పదవులు పొంది, నాపైనే ఎదురు తిరుగుతున్నారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, నరసరావుపేట నుండి నేనె పోటీ చేస్తాను. ఇప్పుడు దాకా నా మంచితనం చుశారు, ఇక నుండి నేనేంటో చూపిస్తాను. ఆ ఇంటి నుండి ఈ ఇంటికి ఎంత దూరమో, ఈ ఇంటి నుండి ఆ ఇంటికి అంతే దూరం గుర్తు పెట్టుకోవాలి. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట వైసీపీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలు పొందుతాను.
పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి మహిళల నిర్బంధించారు. ఓ స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అందులో ఒక వర్గం వైసీపీ నాయకులు కావడంతో మరో వర్గానికి చెందిన మహిళలను అర్ధరాత్రి అరెస్టు చేశారు. వైసిపి నాయకుడి వర్గం ఫిర్యాదుతో 18 ఏళ్ల యువతిని రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. సుమారు 40 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలను నిర్బందించినట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. కనీసం మహిళా హోంగార్డు కూడా రక్షణగా లేకుండా రాత్రి అంతా మహిళలను నిర్బంధించడంపై బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also…
Read Also…
రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశాడని టీడీపీ సీనియర్ నాయకుడు, విద్యావేత్త పెదరాసు సుబ్రహ్మణ్యం మండిపడ్డారు.
శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నంలో విలేఖరుల సమావేశం నిర్వహించిన ఆయన మధ్యతరగతి కార్పొరేట్ స్కూళ్లు నిర్వహించాలంటే కష్టతరంగా మారిందని పేర్కొన్నారు. ఎకానమీ కార్పొరేట్ స్కూల్లలో 2/3 వంతు పిల్లలు అడ్మిషన్లే తగ్గిపోయాయని వాపోయారు. జనాలను బానిస బతుకులకు అలవాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇదే కాకుండా కేంద్రీయ విద్యా వ్యవస్థ తీసుకొచ్చి కార్పొరేట్ స్కూల్లో నిర్వహణ కష్టతరంగా మారడానికి కారకుడుగా సీఎం జగన్ నిలిచాడని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. ఈ వ్యవస్థ వల్ల గత మూడు సంవత్సరాల్లో 8 వేల స్కూలు మూతపడ్డాయని, అప్పుల బాధతో కొన్ని వందల మంది కరస్పాండెంట్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని స్పష్టం చేశారు. సచివాలయాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ ఉద్యోగాలు కూడా రాజ్యాంగబద్ధంగా రిక్రూట్మెంట్ జరగలేదని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి మేల్కొని విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సుబ్రహ్మణ్యం కోరారు. లేదంటే తెలంగాణలో మాదిరి ఆంధ్రాలో కూడా నిరుద్యోగ యువత అందరూ ఎదురుతిరిగి రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గానికి మరో శిరీష అలియాస్ బర్రెలక్క స్థాయిలో పోటీ చేసి తగిన బుద్ధి చెబుతారని సుబ్రహ్మణ్యం హెచ్చరించారు
ఈనెల 30 తేదీన అవుకు రెండవ టన్నల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. ఒక్కో టన్నల్ ద్వారా పదివేల క్యూసెక్కులను కృష్ణా జలాలను అవుకు రిజర్వాయర్, గండికోట రిజర్వాయర్ కు రెండు టన్నల్ ద్వారా 20వేల క్యూసెక్కులను తరలించవచ్చు అని తెలిపారు. రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని మహోన్నత సంకల్పాన్ని స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తుండడం ఈ ప్రాంత వాసుల ఆనందానికి వెలకట్టలేనిది అని చెప్పారు.
రాష్ర్టంలో జగన్ ఆధ్వర్యంలో సిగ్గుమాలిన యాత్ర జరుగుతోంది. దళితులను , బిసిలను అవమానించే యాత్ర జరుగుతుంది. జగన్ అరాచకాలు , దోపిడీ, అత్యాచారం ప్రశ్నిస్తే , అలా ప్రశ్నించిన మహిళా నేతలపై అసబ్యకరంగా పొస్ట్ లు పెట్టించారు. ఆడబిడ్డలపై అసభ్య పొస్టులు పెట్టిన వారిపై నొ యాక్షన్. ఎమ్మెల్యే అదిరెడ్డి భవాని , గౌతు శిరీష , పంచుమర్తి అనురాధ లు పొలీసులకు పిర్యాధు చేస్తే పట్టించుకునే వారు లేరు. బిసి మహిళలను అవమానించి , రోతపుట్టించే రాతలు రాయించి , నా బిసిలు అని మాట్లాడటానికి సిగ్గుందా..? పేరుకే బిసి మంత్రులు , పెత్తనం అంతా రెడ్లదే..? జిల్లాలను సామంత రాజులుగా రెడ్లు పంచుకున్నారు. బొత్స , ధర్మాన , సీదిరి , తమ్మినేని రెడ్ల బూట్లు నాకడానికి తాపత్రయ పడుతున్నారు. వైసిపి ప్రేరేపితంగా హత్యగావింపబడ్డవారు 74 మంది బిసిలు, 28 మంది దళితులు ఉన్నారు. రజక , యాదవ , నాయిబ్రాహ్మన , మత్స్యకార , గీత కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాం. మత్స్యకార పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసాం. టిటిడి చైర్మెన్లుగా బిసిలకు పెద్ద పీట వేసింది టిడిపినే. వైసిపి రెడ్డిలకు మాత్రమే టిటిడి చైర్మెన్ చేసింది. అన్ని పధకాలలో అవినీతి చేసి వేసిన ఎంగిలి మెతుకలు అశపడాలా.? బిసి పధకాలు ముప్పై రద్దు చేసారు. ధర్మాన , బొత్స , తమ్మినేని నిజమైన బిసిలు కాదు. ఉత్తరాంధ్ర మంత్రులంతా బూర్జువా మంత్రులు. 12 యూనివర్సిటీలలో తొమ్మిది మంది విసిలు రెడ్లేనా? బిసి నాయకులపై తప్పుడు కెసులు పెట్టారు. బిసిలకు వెన్ను దన్నుగా ఉన్నారనే చంద్రబాబు పై కుట్ర చేసారు. బిసిలు బాగుపడితే జగన్ కు కడుపు మంట. బిసిల అత్మాభిమానం తాకట్టు పెడుతున్న వారిని బవిష్యత్ క్షమించదు. బిసిలకు అండగా ఉన్నారనే బాబు పై అక్రమ కేసులు పెట్టారు.




Total views : 91110