ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఏపీ మంత్రివర్గంలోకి తీసుకున్న సీఎం చంద్రబాబు వెల్లడించారు. జనసేనలో ప్రధాన కార్యదర్శిగా చురుకుగా వ్యవహరిస్తున్న నాగబాబుకు మంత్రి పదవి కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీంతో పాటుగా టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుల పేర్లను కూడా సీఎం వెల్లడించారు. అయితే నాగబాబుకు ఏ శాఖను కేటాయిస్తారనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కోరికతో పాటుగా.. జనసేన పార్టీకీ నాగబాబు అందించిన సేవలకు గాను ఆయన్ను కేబినెట్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్లో జనసేన బలం మరింత పెరగనుంది.
ఏపీ అసెంబ్లీ నియమాలను అనుసరించి మొత్తం 25 మంత్రి పదవులు ఉండాల్సి ఉంటే, ప్రస్తుతం మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. మిగిలిన ఒక స్థానం జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలో జనసేన తరపున నాగబాబును మంత్రిగా ఖరారు చేస్తూ టీడీపీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జనసేన నుంచి పవన్ కళ్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ మాత్రమే మంత్రివర్గంలో ఉన్నారు. అయితే కూటమి పొత్తు ఒప్పందం ప్రకారం, జనసేనకు నాలుగు మంత్రి పదవులు, బీజేపీకి ఒక పదవి కేటాయించాల్సి ఉంది. అందులో భాగంగా ఈ ఖాళీని నాగబాబుతో భర్తీ చేయనున్నారు. ఇక రాజ్యసభ స్థానాల విషయానికి వస్తే, కూటమి ప్రభుత్వం బీద మస్తాన్, సానా సతీష్ పేర్లను ఖరారు చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
- హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో…
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 89845