రిమాండ్ (Remand) :
సీఎం జగన్పై రాయితో దాడి కేసులో నిందితుడు సతీశ్కు కోర్టు 14 రోజలు పాటు రిమాండ్ (Remand) విధించింది. విజయవాడ సింగ్ నగర్లో బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలో సీఎం జగన్పై రాయితో దాడి జరిగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపి నిందితుడు సతీశ్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు నిందితుడు సతీశ్కు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అయితే నిందితుడు సతీశ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక విషయాలు వెల్లడించారు. సీఎం జగన్ పై నిందితుడు రెండు సార్లు రాయి విసిరినట్లు తెలిపారు. ఒక సారి మిస్ కావడంతో మరోసారి తగిలినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్పై దాడి చేయమని నిందితుడు సతీశ్కు దుర్గారావు అనే వ్యక్తి చెప్పినట్లు చెప్పారు. దాడి తర్వాత దుర్గారావుకు నిందితుడు సతీశ్ ఫోన్ చేశారని, మరోసారి చేస్తే స్విచ్చాఫ్ వచ్చిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…
- గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్చల్..కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నూతన జాతీయ రహదారిపై హైడ్రామా చోటుచేసుకుంది. సేల్స్ టాక్స్ అధికారులమంటూ హైవేపై వాహనాలను ఆపి, తనిఖీల పేరుతో కొందరు వ్యక్తులు సాగిస్తున్న ఆన్లైన్ దోపిడీ బట్టబయలైంది. రసీదులు లేని అక్రమ వసూళ్లతో వాహన డ్రైవర్లను…
- విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..పట్టపగలే నగర నడిబొడ్డున.. జన సంచారం ఉన్న వేళే ఓ మహిళ హత్య కావడం కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్ లోకి దూరి దారుణంగా హత్య చేశాడో దుండగుడు. దొంగతనానికి వచ్చి.. బంగారు నగలు దోచుకునే సమయంలో హత్య చేసిన ఘటన…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: జగన్పై దాడి కేసులో నిందితుడికి 14 రోజల రిమాండ్…




Total views : 78482