ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్భగవత్ డైరెక్షన్లోనే కాంగ్రెస్ నడుస్తున్నదని, గాంధీభవన్లో కాంగ్రెస్ వ్యవహరాలన్నీ నడిపించేది ఆర్ఎస్ఎస్సేనని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. వికారాబాద్లోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో ఎంఐఎం ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ మా ట్లాడుతూ రేవంత్రెడ్డి బతికి ఉన్నంతవరకు ఆర్ఎస్ఎస్తోనే ఉంటారని, ఆయనను కాంగ్రెస్లోకి పంపింది ఆ సంస్థేనని అన్నా రు. ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అయిన రేవంత్ను కొడంగల్లో చిత్తుగా ఓడించాలని ఎంఐ ఎం శ్రేణులకు పిలుపునిచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ను గెలిపించిన ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని, పోటీ పరీక్షలకు బుర్ఖా ధరించి హాజరుకావద్దని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ తొమ్మిదన్నరేండ్లలో తెలంగాణలో బుర్ఖా ధరించి పరీక్షలకు వెళ్తే ఎవరైనా అడ్డుకున్నారా అనేది ఆలోచించాలని కోరారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, రాష్ట్రం సస్యశ్యామలంగా, ప్రశాంతంగా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చి సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మూడోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. తొమ్మదిన్నరేండ్ల అభివృద్ధిని చూసి డిసెంబర్ 30న ఆలోచించి ఓటేయాలని సూచించారు. తొమ్మిదిన్నరేండ్లలో షాదీ ముబారక్ కింద 2 వేల 340 కోట్ల రూపాయల నిధులిచ్చారని, 205 మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేశారని తెలిపారు. 14 లక్షల మంది విద్యార్థులకు 474 కోట్ల రూపాయల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. సీఎం ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద 3 వేల 224 మంది ముస్ల్లింలకు 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసిందని వెల్లడించారు. గోషామహాల్లో బీజేపీకి మద్దతిస్తున్నది కాంగ్రెస్సేనని ఆరోపించారు. వయనాడ్లో రాహుల్గాంధీ పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తెలిపారు.
Bjp
కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా తెలంగాణకు రానున్నారు. సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఆ తర్వాత నల్గొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్లలో నిర్వహించే సభలలో పాల్గొంటారు. ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ షా 17న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే 18కి వాయిదా పడింది.
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చింతల్ డివిజన్ లో శివ నగర్, శ్రీ సాయి కాలనీ, రంగా నగర్, సాగర్ అపార్ట్మెంట్స్, సిరి టవర్స్ లలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ విస్తృత ప్రచారం చేశారు. బీజేపీ సీనియర్ నేత సదానంద్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ నగర్ కు చెందిన పలువురు యువకులు బీజేపీలో చేరారు. బీజేపీ కండువా కప్పి ఆహ్వానించారు. పలు కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్స్ అసోసియేషన్ లు, కాలనీ పెద్దలతో సమావేశమయ్యారు. చింతల్ డివిజన్ ను టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అభివృద్ధి చేయడంలో విఫలమయ్యాడన్నారు. భగత్ సింగ్ నగర్ మల్టి పర్పస్ ఫంక్షన్ హల్ ను ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తేలేదని మండిపడ్డారు. 2018 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. బీజేపీ ని గెలిపిస్తే చింతల్ డివిజన్ లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. తెలంగాణ గ్రామీణ ప్రజలు కాంగ్రెస్కు మద్దతుగా ఉన్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని తెలిపారు. తెలంగాణలో మాదిగలను మోసం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కులాలకు అతీతంగా … పేదరికాన్ని కొలమానంగా తీసుకొని రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చి తప్పు చేశారన్నారు. రెండు పార్టీలకు కలిపి ఐదు సీట్లకు మించిరావన్నారు.
బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఫ్యామిలీ వికాస్ అని.. కాంగ్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీ వికాస్ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. కుటుంబ ప్రయోజనాల కోసం తప్పితే ఈ రెండు పార్టీలు ప్రజల మంచి కోరదన్నారు. కేసీఆర్కు సీఎంగా అవకాశం ఇస్తే అడుక్కునే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. బై ఎలక్షన్ వస్తే కుర్చీ అక్కడే వేసుకున్న కేసీఆర్ ఆ తర్వాత ముఖం చాటేశారన్నారు. ఇప్పుడు హెలికాప్టర్ వేసుకుని వేట కుక్కల్లాగా ఓట్లు అడుక్కుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో బీఆర్ఎస్ సర్కార్ ఉందన్నారు. అంటే ఆగడు.. పంటే లేవడు… అంటూ ఎద్దేవా చేశారు. 10 ఏంళ్లలో చేయని అభివృద్ధి 10 రోజుల్లో చేస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫక్తు రాజకీయాలతో తెలంగాణ ఆగమవుతోందన్నారు. కాంగ్రెస్ 70 ఏండ్లు అధికారంలో ఉండి గరీబ్ హఠావో.. ఇందిరమ్మ ఇండ్లు అని నినాదాకే పరిమితమైందన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పరిస్థితి మారిందని వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల డీఎన్ఏ అవినీతి మాత్రమే అని అన్నారు. పూటకో అవినీతికి పాల్పడుతున్నాయని ఎంపీ ఆరోపించారు.
నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ లిఫ్ట్ శిలాఫలకం వద్ద నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ 40 సంవత్సరాలుగా లిఫ్ట్ పేరు చెప్తూ ఇక్కడ ఉన్న గిరిజనులు మభ్యపెట్టి మోసం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎలక్షన్స్ లో నెల్లికలు లిస్టు నీళ్లు పారియకపోతే మేము ఓట్లు అడగం అన్నారు. నోముల నరసింహయ్య మరణానంతరం వచ్చిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి నిల్లికలు ప్రాంతంలో శిలాఫలకం వేసి కుర్చీ వేసుకొని ఇక్కడ నీళ్లు పారిస్తానని హామీ ఇచ్చారు నీళ్లు పారించకుంటే ఓట్లు అడగం నా మంత్రులు మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా మీ వద్దకు రారు అని మోసపూరితమైన మాటలు చెప్పి ఇప్పటివరకు ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు ఉప ఎన్నికల సమయంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి 18 నెల లో నెల్లికల్ లిఫ్టు పూర్తికాకపోతే నా మంత్రి పదవికి రాజీనామా చేసి ఓట్లు అడగం అని చెప్పారు ఎక్కడ పోయాడు మంత్రి జగదీశ్వర్ రెడ్డి . అలాగే ముఖ్యమంత్రి గారికి కుర్చీ దొరకక ఇక్కడ రావడం లేదు అని మేమే కుర్చీ వేసి పెట్టినాము ఈరోజు హాలియాకి ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ కుర్చీలో కూర్చొని నీళ్లు పారించవలసిందిగా మా విజ్ఞప్తి.
Read Also..
కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే, బిజెపి పార్టీతోనే సాధ్యమని, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిజెపి పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ తెలిపారు.
బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ను, శ్రీ గణేష్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. వివిధ బస్తీలలో, వార్డులలో శ్రీ గణేష్ బిజెపి నాయకులతో కలిసి, బిజెపి సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ, ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు.
శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గ ప్రజలకు ఎంతో దగ్గర అయిన శ్రీ గణేష్ విజయం ఖాయం అని, నియోజకవర్గ ప్రజలు శ్రీ గణేష్ వెంట ఉంటామని ఉన్నామని, స్థానిక ప్రజలు శ్రీ గణేష్ కు భరోసా ఇస్తున్నారు.ఈ సందర్భంగా కమలం పువ్వు గుర్తు పై ఓటు వేసి భారీ మెజారిటీతో తనను గెలిపించాలని, కాలనీ ప్రజలను కోరారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు ఒక్కటే నని బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ని గెలిపించేందుకే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని..కరీంనగర్ బారసా అసెంబ్లీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.. ఆదివారం హుస్సేన్ పుర నేషనల్ ప్యాలస్ లో ముస్లీం సోదరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోమ్ మినిస్టర్ మెహమూద్ అలీ, ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ మంత్రి గంగుల కమలాకర్ హాజరైనారు..
ఈ సందర్బంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ సమైక్య పాలనలో ఎక్కడ చుసిన గొడవలు, శాంతి భద్రతల సమస్యలు 144 సెక్షన్ లులాఠీఛార్జి లు ఉండేవని అన్నారు.. రాజకీయ అవసరాల కోసం హిందూ ముస్లిం ల మధ్య గొడవలు పెట్టి లబ్ది పొందే వారని అన్నారు.. బయటకు వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చేవరకు తల్లిదండ్రులు భయం భయంగా గడిపే వారని…తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకహిందూ ముస్లింలు ఒకటై కలిసిమెలిసి జీవిస్తున్నారని అన్నారు.. కెసిఆర్ హయంలో కడుపునిండా తిని కంటి నిండా నిద్రపోతున్నారని గుర్తు చేశారు.. శాంతిభద్రతలు అదుపులో ఉన్నప్పుడే పెద్దపెద్ద కంపెనీలో తరలివస్తాయని.. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు.. రానున్న ఎన్నికల్లో సెక్యులర్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.. తెచ్చుకున్న తెలంగాణ కెసిఆర్ చేతుల్లోనే భద్రంగా ఉంటుందని వెల్లడించారు.. కానీ ప్రతిపక్షాలు వేస్తే కరెంటు నీళ్లు తెలంగాణ సంపదనను దోచుకుంటారని..కరీంనగర్ ప్రజలు ఒకసారి ఆలోచించాలని… అభివృద్ధిని చూసి మరోసారి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ని ఆశీర్వదించాలని అన్నారు..కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు..
పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో కాంగ్రెస్ మహిళా నాయకురాలు పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్లో చేరారు. ఆమెకు కేటీఆర్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాగైనా లబ్ది పొందాలని కాంగ్రెస్, బీజేపీలు కొత్త కుట్రలకు తెరలేపాయని అనుమానం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఢిల్లీ పెద్దలు వదంతులు సృష్టిస్తారు.. రాష్ట్ర ప్రజలందరూ ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో కేసీఆర్ చక్రం తిప్పకుండా కుట్రలకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలే లక్ష్యంగా రాబోయే 15 రోజుల పాటు ఇవే కుట్రలకు ప్లాన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మన ఆలోచనలకు మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తారు.. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు గాడి తప్పొద్దు.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read Also..
Read Also..
ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ వేసి, న్యాయం చేస్తామని ప్రకటించారు. న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉంది. మీ పోరాటంలో న్యాయం ఉందని భావిస్తున్నాని మోదీ తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నా మని తెలిపారు. మీ హక్కుల సాధనలో తమ తరుపున సంపూర్ణ మద్దతు ఉంటుందని మోదీ తెలిపారు. వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు హైదరాబాద్ కు వచ్చారు ప్రదాని మోదీ. మొదటి సారి ఎల్హీ స్డేడియంలో ఏర్పాటు చేసిన సభలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించారు. నేడు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మాదిగల విశ్వరూప సభలో 3౦ ఏళ్ల మాదిగల పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటింటారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో బీజేపీ ముందుకెళ్తుంన్నారు ప్రదాని మోదీ. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో పార్టీలు వచ్చాయని..ఏన్నో హామీలను ఇచ్చి మోసం చేసాయన్నారు. వారి తరుపున క్షమాపణ చేప్పేందుకు తాను వ్చచానన్నారు మోదీ. బీజేపీ అన్ని వర్గాలకు అండగా నిలిచిన పార్టీ అని తెలిపారు.
Read Also..
Read Also..




Total views : 90650