టిడిపి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మరోమారు హాట్ కామెంట్స్ చేశారు. నగరి వైసీపీ ఎమ్మెల్యే మంత్రి రోజా వేసిన ప్రైవేటు కేసు విచారణలో భాగంగా నగరి జిల్లా కోర్టుకు టిడిపి మాజీ మంత్రి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ హాజరయ్యారు. కోర్టు బయట మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టిడిపి నాయకులను, కార్యకర్తలను వేధించి వారి మీద కేసులు పెట్టి, వారిని భయభ్రాంతులకు గురి చేయాలని ఆలోచిస్తున్నారే తప్ప రాష్ట్రాన్ని గాలి వదిలేసారని ఆరోపించారు. ప్రజాస్వామ్య పద్దతిలో, రూల్ ఆఫ్ లా ప్రకారం కాకుండా తనదైన సైకో పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు పై ఏ ఆధారాలు లేకుండా కేసులు పెట్టారు, ఎలాంటి ఆధారాలు లేకుండా అయనను జైల్లో నిర్బంధించి ఇబ్బందులు పెట్టారు. కోర్టు మొట్టికాయలు వేసింది. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యక్తిగత ధూషనలకు వెళ్ళారు. కుటుంబంలో మహిళను టార్గెట్ చేశారు, దానికి దీటుగా టిడిపి నాయకులు వ్యవహరిస్తే వారి మీద అక్రమ కేసులు బనాయించి జైలులకు పంపిస్తూ కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. అందరినీ బెదిరించి, బయపెట్టి అధికారంలో ఉండాలని జగన్ చూస్తున్నాడు. ఇక నాపైనా గుంటూరు, నగరి నుండి చాలా చోట్లు దోంగ కేసులు పెట్టారు. నెల రోజుల్లో చంద్రబాబు, పవన్ పాలనా వస్తుందని, జగన్ నాశనం చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వారిద్దరూ పనిచేస్తారు అన్నారు. ఎన్నికల తరువాత జగన్ రాష్ట్రంలో ఉండడని, జగన్ కు మిగిలేది చంచల్ గూడ జైలు అని అన్నారు. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని, రోజా ముందు తన నోరును సరిచేసుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకులే ఉంటారని, తెలుగుదేశం జెండాను చనిపోయే వరకు భుజాన మోస్తూనే ఉంటామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అన్నారు.
Chandrababu Naidu
ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఏడు లక్షల కోట్ల అప్పులు చేశామని ఒకరంటే, 10 లక్షల కోట్లు అని ఇంకొకరు అంటున్నారనీ, వైసీపీ ప్రభుత్వం ఏకంగా 13 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు అంటున్నారని బుగ్గన చెబుతూ అసలు ఏ ప్రాతిపదికన ఇలా అంటున్నారని నిలదీశారు. కోవిడ్ సమయంలో రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలమైన విషయం నిజమేనని ఆయన అన్నారు. అయితే తెలుగుదేశం హయాంతో పోలిస్తే వైఎస్ఆర్ సీపీ అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్లలో చేసిన అప్పులు తక్కువేనన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014-2019 మధ్య కాలంలో అప్పులు 22 శాతం పెరిగితే, ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పెరిగిన అప్పులు 12 శాతం మాత్రమేనని మంత్రి వివరించారు. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల పాలనలో రెవెన్యూ రాబడి 6 శాతంగా ఉందని, వైసీపీ ప్రభుత్వంలో 16.7 శాతంగా రెవెన్యూ రాబడి ఉందని తెలియజేశారు. 2018-19 చంద్రబాబు నాయుడి పాలనలో 5.3 శాతం నిరుద్యోగిత ఉందని, 2018-19లో 44 లక్షల 86 వేల పిఎఫ్ అకౌంట్లు ఉన్నాయన్నారు.
సత్తెనపల్లిలో కన్నా క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సత్తెనపల్లి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తాడని ప్రకటించారు. దీనిలో ఎవరికి ఏ విధమైనటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరైనా మాకు టికెట్ వస్తుందని చెప్పుకుంటు తిరిగితే అది అబద్ధ ప్రచారమే, అటువంటి అబద్ధ ప్రచారాన్ని నియోజకవర్గంలో ఎవరు నమ్మ వద్దని అన్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు పార్టీ విజయానికి కృషి చేయాలని అచ్చం నాయుడు చంద్రబాబు నాయుడి మాటగా ఈ రోజు చెప్పడం జరిగిందని అన్నారు. చంద్రబాబుకి, లోకేష్ బాబుకి, అచ్చం నాయుడుకి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుకు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.
ఈ నెల కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం లో చంద్రబాబు నాయుడు నిర్వహించే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా సభను విజయవంతం చేయాలని జనసేన రాష్ట్ర పి. ఏ. సి సభ్యులు రూరల్ ఇంఛార్జి పంతం నానాజీ కోరారు. కాకినాడ గుడారీ గుంట పంతం నానాజీ నివాసంలో జనసేన నాయకులతో కలిసి ఛలో తుని పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం నానాజీ మాట్లాడుతూ జనసేన, టి.డి.పి పార్టీల పొత్తు కుదిరిన తర్వాత మొట్ట మొదటిసారిగా చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా తుని లో బహిరంగ సభ నిర్వహిస్తున్నారని, ఈ సభను తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు జనసేన నాయకులు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వై.ఎస్.అర్ రహిత ఆంధ్రప్రదేశ్, వై.ఎస్.అర్ రహిత కాకినాడ జిల్లా ప్రధాన అంశంగా ఇద్దరు అది నాయకులు తీసుకున్న నిర్ణయం తో తెలుగుదేశం పార్టీ నిర్వహించే చంద్రబాబు సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను, ప్రజలను కోరారు. వై.సి.పి ముక్త ఆంధ్రప్రదేశ్ కై ఛలో తుని సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జీతాలు పెంచాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉలవపాడు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని, ఉలవపాడులో అంగన్వాడీల సమ్మె కొనసాగుతూనే ఉంది. కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం శిబిరానికి వెళ్లి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లోనూ.. చంద్రబాబు నాయుడు అంగన్వాడీలకు రెండుసార్లు జీతాలు పెంచారని గుర్తు చేశారు. కానీ అనేక ఆశలు చూపి, వారి చేత ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక లక్షలాది అక్క చెల్లెమ్మలను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణలో కంటే అదనంగా జీతాలు పెంచుతానని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పారని నాగేశ్వరావు అన్నారు. ఒకసారి మాత్రమే వెయ్యి రూపాయలు పెంచి, వారికి సంక్షేమ పథకాల అమలులో కోత విధించారని మండిపడ్డారు. ఉద్యోగులకు తమ సమస్యలు చెప్పుకునే హక్కు ఉంటుందని, కానీ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల సమ్మెపై ఉక్కుపాదం మోపి రకరకాలుగా బెదిరించడం దుర్మార్గమని నాగేశ్వరరావు అన్నారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అంగన్వాడీలకు సంబంధించిన అన్ని సమస్యలను చంద్రబాబు నాయుడు గారు పరిష్కరిస్తారని నాగేశ్వరరావు తెలిపారు. ఎలాంటి షరతులు విధించకుండానే, మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రతి మహిళ కుటుంబానికి అందజేస్తారని వివరించారు. సిఐటియు ఆధ్వర్యంలో కార్యక్రమం జరగగా, మండల పార్టీ అధ్యక్షులు రాచగర్ల సుబ్బారావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు అంచుపోగు వాసు, ఎంపీటీసీ దార్ల యలమందమ్మ, క్లస్టర్ ఇంచార్జ్ లు బెల్లం కృష్ణమోహన్, పోలుబోయిన శ్రీనివాసులు, సుదర్శి శ్రీనివాసులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
శెట్టిపల్లి గ్రామంలో టీడీపీ సర్పంచ్ రీటా ఎల్లప్పకి చెందిన జెసిబి అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో జరిగింది. చంద్రబాబు నాయుడు పర్యటనలో చురుగ్గా పాల్గొన్న సర్పంచ్.. కావాలనే తన జెసిబి అద్దాలను పగులగొట్టారని సర్పంచ్ రీటా ఎల్లప్ప పేర్కొన్నారు. పోలీసులకు పిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.
చిత్తూరు జిల్లా.. నారా చంద్రబాబు నాయుడు మూడో రోజు కుప్పంలో పర్యటన వివరాలు.. ఉదయం 11 గంటలకు ప్రజలనుండి వినతి పత్రాలు స్వీకరించి, 12 గంటలకు పిఎస్ మెడికల్ కాలేజ్ వద్ద ఏర్పాటుచేసిన కనకదాసు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు కుప్పం ఎన్టీఆర్ విగ్రహం వద్ద అన్న క్యాంటీన్ నందు నిరుపేదలకు భోజనాలు అందిస్తారు. కుప్పంలోని పెద్దపులి గంగమ్మ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కొత్తపేట పెద్ద మసీదులో మైనార్టీలతో కలిసి దువా లో పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు కుప్పం మండలం మల్లానూరు బస్టాండ్ లో పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. పబ్లిక్ మీటింగ్ అనంతరం క్రిష్ణగిరి మీదుగా బెంగళూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకుని, అక్కడి నుండి హైదరాబాదు చేరుకుంటారు.
రాయదుర్గం నియోజకవర్గంలోని డి హీరేహాల్ మండలం పాత హడగలి గ్రామంలో తెదేపా పోలిట్ సభ్యులు మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వైస్ సర్పంచ్ హనుమంతుతో పాటు, 30 కుటుంబాలు సోమవారం వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. వైకాపా నాయకులకు కాలవ శ్రీనివాసులు తెదేపా కండువాలు కప్పి తమ పార్టీలోకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. పాత హడగలి గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంటుందని , తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు. రాష్ట్రంలో వైకాపా పాలన పట్ల విసుగు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని కాలవ శ్రీనివాసులు ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో డి హీరే హాల్ మండల తెదేపా కన్వీనర్ హనుమంత రెడ్డి, తెదేపా సీనియర్ నాయకులు కాదలూరు మోహన్ రెడ్డి, తెదేపా ఎంపీటీసీలు మొండి మల్లికార్జున, మురడి గంగాధర, మండల తెదేపా నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో వైసీపీ నాయకుల మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి కండువా కప్పుకున్న పెదకూరపాడు వైసీపీ బహిష్కరణ నేతలు, ఖండించిన క్రోసూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఈదా సాంబి రెడ్డి. వైసీపీ పార్టీలో నాయకుల పేరుతో అవినీతికి పాల్పడుతున్న వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తే వాళ్ళు టిడిపిలోకి ఆహ్వానిస్తున్న చంద్రబాబు ఇంకెంత అవినీతిపరుడో అర్ధం చేసుకోవాలి. పెదకూరపాడు నియోజకవర్గంలో టిడిపికి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో ఇప్పటివరకు ఖరారు కాలేదు. మా నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గాని, అతని కుమారుడు లోకేష్ గాని, ఎవరు అభ్యర్థిగా వచ్చినా కూడా శంకర్రావు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం తథ్యం అని వారు తెగేసి చెప్పారు.
సిఎం జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా తరిమి కొట్టడానికి ప్రజాగళాన్ని నిర్వహించబోతున్నామని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తెలిపారు. పార్వతీపురం పట్టణంలో టిడిపి ఇన్ ఛార్జ్ బోనాల విజయచంద్ర నివాసంలో నక్కా మీడియాతో మాట్లాడారు. యువగళం పాదయాత్రలో పార్వతీపురం నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. లోకేష్ యువగళం పాదయాత్ర ఆపేందుకు ఎన్నో అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. రెండు నెలలు పాదయాత్రను ఆపగలిగారు కానీ ప్రజల్లో ఉన్న స్పందనను మాత్రం ఆపలేకపోయారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు పై అక్రమ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆత్మసంతృప్తి పొందారని విమర్శించారు. ఎన్నికలు త్వరలో వస్తున్నందున ఇచ్చాపురం వరకు సాగవలసిన పాదయాత్రను విశాఖపట్నంలోనే ముగిస్తున్నామని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. అనంతరం అంగన్వాడీలు చేస్తున్న ధర్నాకు మద్ధతుగా దీక్షా శిబిరం వద్దకు వెళ్లి నక్కా ఆనంద్ బాబు సంఘీభావం తెలిపారు.