జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గడి బురుజు వద్ద గల సూపియాన్ కట్టే మిషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంబవించింది. తెల్లవారుజామున ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దుకాణంలో కర్రలు పెద్ద ఎత్తున నిలువ ఉండడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. జనావాసాల మధ్యనే కట్టే మిషన్ దుకాణం ఉండడంతో ఎగిసిపడుతున్న మంటలను చూసి చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటివరకు ఎగిసిపడిన మంటలు కాస్త తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది .కాలిపోయిన కర్ర విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని స్థానికులు అంటున్నారు.
CVr health
విజయనగరం జిల్లా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన. బొబ్బిలి వేదికగా బహిరంగ సభ. తెలుగు తమ్ముళ్లలో నూతనుత్తేజం కనిపిస్తోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు జిల్లాకు రానున్నారు. బొబ్బిలిలోని రాజా కాలేజి మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఆ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. తెలుగు తమ్ముళ్లను భారీగా తరలించేందుకు పార్టీ నాయకులు సన్నాహాలు చేశారు. ఇప్పటికే గ్రామ స్థాయిలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికల వాతావరణం దగ్గరపడడంతో ప్రచారం ముమ్మరం చేయనున్నారు. ఇందులో భాగంగానే ‘రా… కదిలి రా’ అనే కార్యక్రమంలో భాగంగా అధినేత చంద్రబాబు మరోసారి జిల్లాకు వస్తున్నారు. ఇటీవలే భోగాపురం మండలం పోలిపల్లిలో నిర్వహించిన యువగళం విజయోత్సవ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి ఎన్నికల శంఖారావం పూరించారు. ఈసారి బొబ్బిలి వేదికగా విజయనగరం – పార్వతీపురం మన్యం జిల్లాల కేడర్కు బాబు దిశానిర్థేశం చేయనున్నారు. బొబ్బిలి కేంద్రం ఈ రెండు జిల్లాలకు సమాంతర దూరంలోనూ, పార్టీకి కాస్త బలమైన నియోజకవర్గంగాను గుర్తించిన పార్టీ ఇక్కడ సభ నిర్వహించేందుకు నిర్ణయించినట్టుగా టిడిపి నాయకులు చెబుతున్నారు. బాబు వరుస పర్యటనలతో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో జోష్ కనిపిస్తోంది. విజయనగరం, బొబ్బిలి, రాజాం, చీపురుపల్లి నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గజపతినగరం, నెల్లిమర్ల, ఎస్.కోట నియోజకవర్గాల టికెట్ల పై కూడా కసరత్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లోని ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో బాబు దృష్టిలో పడేందుకు కూడా తహతహలాడుతున్నారు. గత నెల 20న పోలిపల్లి బహిరంగ సభ మాదిరిగానే దారిపొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. నేడు జరగనున్న బహిరంగ సభల్లో కేడర్ను ఎన్నికలకు సమాయత్తం చేయడం, వైసిపిలోనూ, ప్రభుత్వంలోనూ లోపాలను, వైసిపి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను, అమలుకాని హామీలను ఎత్తి చూపడమే బాబు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
బుధవారం ఉదయం 10.15గంటలకు గన్నవరం ఎయిర్పోర్టులో బయలుదేరి, 11గంటలకు విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బొబ్బిలి రాజా కాలేజీ మైదానానికి 11.40గంటలకు చేరుకుంటారు. 12గంటలకు సభ ప్రారంభమై 1.30గంటలకు ముగుస్తుంది. అనంతరం 2.30గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. మిగిలిన గంట వ్యవధిలో పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలతో జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. బహిరంగ సభ ఏర్పాట్లును మంగళవారం టిడిపి నాయకులు కిమిడి కళా వెంకటరావు, మాజీ మంత్రి సుజరుకృష్ణరంగారావు, నియోజకవర్గ ఇన్చార్జి బేబినాయన, కూన రవికుమార్ తదితరులు పరిశీలించారు..
అమరావతి, ఈనెల 11న వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి రంగం సిద్ధం చేసుకున్న కేసినేని నాని. తనతో పాటు మరో 5 అసెంబ్లీ సీట్లు కోరిన నాని. విజయవాడ తూర్పు నుండి తన కూతురు కేసినేని శ్వేతకు. విజయవాడ పశ్చిమ నుండి ఎంఎస్ బేగ్, నందిగామ నుండి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుండి నల్లగట్ల స్వామి దాసుకు, మైలవరం నుండి బొమ్మసాని సుబ్బారావుకు ఇవ్వమని అడిగిన నాని. తనకు ఎంపీ పదవి తోపాటు రెండు సీట్లు మాత్రమే వాగ్దానం చేసిన అధిష్టానం.
కాకినాడ, ఆ అమ్మను తలుచుకోగానే పలికి వరాలిస్తుంది. అందుకే తలుపులమ్మ అని పిలుచుకున్నారు. ఈ అమ్మవారు కాకినాడ జిల్లా తుని మండలం లోవలో కొలువుదీరారు. తలుచుకోగానే ఆమె ఇంటికి వచ్చేది. ఓ రోజు పశువుల కాపరులకు కనిపించి తాను కొండ పై ఉన్న లోయలో విగ్రహ రూపంలో ఉన్నానని ప్రతిష్టించి పూజలు చేయాలని సూచించింది. వేల సంవత్సరాల ఆధ్యాత్మిక చరిత్ర గలిగిన ఆ ఆలయమే తలుపులమ్మ లోయ. కాలక్రమేణా తలుపులమ్మ లోవగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా పేరుపొందారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయానికి ఎస్కలేటర్ సౌకర్యంతో పాటు ఆధునిక వసతుల కోసం 14 కోట్ల రూపాయలు వెచ్చించి భక్తుల కోసం బహుళ అంతస్తుల భవనాలు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆలయంలో పనిచేయడం తన పూర్వజన్మ సుకృతం అని చెబుతున్న తలుపులమ్మ లోవ కార్యనిర్వహణాధికారి పెన్మత్స విశ్వనాథరాజు.
విజయవాడ, ఏపీలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణ పై రెండో రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష. నిన్న గుర్తింపు పొందిన పార్టీల నుండి వినతుల స్వీకరణ చేపట్టిన సీఈసీ రాజీవ్ కుమార్. విడతలవారీగా కలెక్టర్లు, ఎస్పీలు , ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సన్నద్దత పై అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఈసీ. నేడు పార్టీలు ఇచ్చిన వినతులు, ఫిర్యాదుల పై, ఎన్నికలకు అధికార యంత్రాంగం ఉన్నతస్దాయి చర్చ జరుపనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం.
ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు వర్గాలకు అందించాలనే తపన కలిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని కదిరి బ్లూమున్ విద్యాసంస్థల అధినేత శివశంకర్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ తీర్థం పుచ్చుకున్న కదిరి పట్టణానికి చెందిన బ్లూ మూన్ విద్యాసంస్థల అధినేత శివశంకర్, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షులు గవ్వల శ్రీనివాసులు, సైదాపురం చిన్నపరెడ్డి మంగళవారం కదిరి జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ.. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన పవన్ కళ్యాణ్ సమాజంలోని నిరుపేదలకు అండగా నిలవాలన్న ఆశయాలకు ఆకర్షితులై మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలనే సంకల్పంతోనే పార్టీలో చేరామని చివరి శ్వాస వరకు పవన్ కళ్యాణ్ తోనే రాజకీయ జీవితం కొనసాగుతుందన్నారు. పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పేదలకు అండగా కార్యకర్తలకు తోడుగా నిరంతరం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
తమిళనాడు రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తూత్తుకుడి, కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్పట్టు, కన్యాకుమారి సహా 18 జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. ఈ వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించింది.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో స్కూల్ బస్ ను లారీ ఢీ కొట్టడంతో విద్యార్థులకు గాయాలయ్యాయి. రెబ్బన మండలం ఇంద్రానగర్ జాతీయ రహదారిపై స్కూల్ బస్ ను లారీ ఢీ కొట్టింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును లారీ ఢీ కొనడంతో బస్సులో ఉన్న విద్యార్థులకు గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రైవేట్ స్కూల్ కు చెందిన బస్ 30 మంది పిల్లలతో వెళ్తున్న క్రమంలో, కొండపల్లి గ్రామంలో కొంత మంది పిల్లలను దింపాల్సి ఉండటంతో రాంగ్ రూట్ లో వెళ్లారు. దీంతో ఎదురుగా వస్తున్న లారీ – బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు గాయాలయ్యాయి. కొంతమంది విద్యార్థులను కాగజ్ నగర్ కు, మరికొంతమంది విద్యార్థులను మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. బస్ డ్రైవర్ రాంగ్ రూట్ లో రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయంలో ఉన్న చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ పేరును ప్రభుత్వం మార్చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. గత ప్రభుత్వం 2019 లో చిల్డ్రన్స్ పార్క్ కి కృష్ణమనేని వెంకట్రామారావు ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ గా పేరు పెట్టి జీవోను జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ పేరును మార్చుతూ రవాణా శాఖ లో జీవో ను జారీ చేసింది. జువ్వాడి చొక్కా రావు ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుగా మార్పు చేసింది.






Total views : 90764