గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలులోని బంధువుల స్వగృహానికి మిజోరాం రాష్ట్ర గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు, దంపతులు కుటుంబ సమేతంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల సమయంలో విచ్చేశారు. నిడుబ్రోలు చేరుకున్న మిజోరాం రాష్ట్ర గవర్నర్ డా.కంభంపాటి హరిబాబును గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి పి.శ్రీఖర్, గుంటూరు వెస్ట్ డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి, పొన్నూరు మండల తహశీల్దార్ శ్రీకాంత్ కేదార్నాథ్, పొన్నూరు మునిసిపల్ కమిషనర్ నయీమ్ అహ్మద్ లు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నిడుబ్రోలులో బంధువులు ఇంటిలో గడిపిన డాక్టర్ కంభంపాటి హరిబాబు సాయంత్రం 6:00 గంటల సమయంలో తిరిగి విజయవాడకు ప్రయాణమయ్యారు.
CVr health
అన్నమయ్య జిల్లా, సివిఆర్ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన పలువురు నేతలు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోనీ పలువురు ప్రముఖులు తమ కార్యాలయాలలో 2024 సివిఅర్ న్యూస్ ఛానెల్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించి సివిఆర్ న్యూస్ వీక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుంటూ, నిజాలను నిర్భయంగా ప్రసారం చేస్తూ ప్రజల ఆధారభిమానాలు పొందుతూ ఇలాగే కొనసాగాలి అన్నారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో విరజిల్లాలని వారు ఆకాంక్షించారు. ఆవిష్కరించిన ప్రముఖులు టిటిడి పాలక మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు, వైసిపి విభాగం మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, వైకాపా సీనియర్ నాయకులు,మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి, ప్రతిభా జూనియర్ కళాశాల కరస్పాండెంట్ అరమాటి శివగంగి రెడ్డి,తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు బోనమాల ఖాదర్ వలీ, అన్నమయ్య కన్స్ట్రక్షన్ అరమాటి జంగం రెడ్డి.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం మండలం మున్సిపాలిటీ కార్మికుల బిక్షాటన. గత 15రోజుల నుండి ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాలిటీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు దేవాభక్తుని నాగబాబు మద్దతు పలికారు. ఈ సందర్భంగా నాగబాబు
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం మాట్లాడుతూ గత 15 రోజులుగా జరుగుతున్న సమ్మెకు ప్రభుత్వం ఇకనైనా స్పందించి పారిశుద్ధ్య కార్మికుల న్యాయ పరమైన కోరికలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.సి.పి.ఐ.యు నాయకులు గొల్లపూడి ప్రసాద్, జనసేన నాయకులు సిరిపురం సురేష్, దారపురెడ్డి నాగభూషణం, ధనుంజయ్, తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ, ఎలక్షన్ కమిషన్ ను కలవకుండా నన్ను అడ్డుకుంటున్నారు. ఊరు పేరు లేని పార్టీకి సమయం ఇచ్చారు. పవన్, షర్మిల కంటే ఎక్కువ ఓట్లు తెలంగాణ లో నా పార్టీ కి వచ్చాయి. ఎపిలో పోటీ చేస్తున్నాం అడ్డుకుంటామంటే మీ పప్పులు ఉడకవు. మార్చిలో ఎన్నికలు వద్దు చివరి లో పెట్టమన్నాం. ఎలక్షన్ అవ్వగానే ఓట్లు లెక్కించండి అని డిమాండ్ చేస్తున్నా. రెండు కులాలు, రెండు కుటుంబాలేనా మనల్ని నడిపేది. నా పోరాటం ఆగదు నేను ఇక్కడే ధర్నాకు దిగతా. సౌత్, తెలుగు సత్తా మోదీకి చూపుదాం. బాబు రావాలంటే జాబు రావాలి అని గతంలో నువ్వే కదా అన్నావ్, ఏం జాబులిచ్చావు. ప్రజాస్వామ్యం కోసం పోరాడుదాం అని కేఏ పాల్ అన్నారు.
విజయవాడ, కేంద్ర ఎన్నికల చీఫ్ రాజీవ్ కుమార్ ని కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చివరి దశలో పెట్టాలని కోరాను. ఎన్నికల రోజే రిజల్ట్ కూడా ప్రకటించాలి. కోవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు అవసరం. కాపులందరూ బయటకు రావాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ కి నా పర్సనల్ రిక్వెస్ట్ వంగవీటి రంగాని చంపిన పార్టీతో కలవద్దు. నా ఆరోగ్యం బాగానే ఉంది. నా మీద విష ప్రయోగం చేసినా దేవుని కృపతో వైద్యుల సహాయంతో బయటపడ్డాను. నా మీద విష ప్రయోగానికి సంబంధించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను.
విజయవాడ, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్. 18వేల కోట్ల రూపాయల ఉద్యోగులు, ఉపాధ్యాయుల సొమ్ము ప్రభుత్వం వారి సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ చలో విజయవాడకు పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయుల నిర్భంధం. విజయవాడ యూటీఎఫ్ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులను యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో నిర్భంధించిన పోలీసులు. నిరసన తెలిపి తీరుతామంటున్న ఉపాధ్యాయులు. ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్న పోలీసులు. లెనిన్ సెంటర్, ధర్నా చౌక్ ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఉపాధ్యాయులు అరెస్టు.
అనంతపురం, గుత్తి పట్టణంలో ఎస్మా చట్టాన్ని రద్దు చేసి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో చేపట్టిన సిపిఐ నాయకులు మరియు అంగన్వాడీ వర్కర్లు. రాస్తారోకో ను అడ్డుకున్న పోలీసులు. సిపిఐ నాయకులను మరియు అంగన్వాడిని వర్కర్ లను పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.
కాకినాడ జిల్లా, ప్రత్తిపాడులో మళ్లీ మొదలైన సీటు రాజకీయ రచ్చ. పత్తిపాడు ఎమ్మెల్యే సీటు పై స్పందించిన సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్. జగన్ మీద నాకు నమ్మకం ఉంది తిరిగి నాకే సీటు వస్తుంది అని చెబుతున్న పర్వత. పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కు సీటు లేదని చెప్పిన అధికార పార్టీ. పత్తిపాడుకు వరుపుల సుబ్బారావును కొత్త ఇన్చార్జిగా బాధ్యతలు ఇచ్చిన అధికార పార్టీ. ప్రజా దీవెన పేరుతో ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ దీవెనలు సంపాదించుకునేందుకు కార్యచరణ సిద్ధం చేసుకున్న పర్వత. నాకు పార్టీ బాధ్యతలు ఇచ్చింది , ఆ బాధ్యతలు ప్రకారం నేను నియోజకవర్గంలో కేడర్ ని బలోపేతం చేస్తున్నాని అంటున్న కొత్త ఇంచార్జ్ వరుపుల సుబ్బారావు. క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ను డిస్టర్బ్ చేయడం కోసమే ప్రజా దీవెన పేరుతో కార్యక్రమాలు పెడుతున్నారని అంటున్నా రాజకీయ విశ్లేషకులు.
కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ పరిధిలోని చంద్రమౌళి నగర్ కాలనీలో ఎలక్షన్ ప్రచారం ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జరగబోవు ఎన్నికల్లో పడుగుపాడు పంచాయతీలో అత్యధిక మెజార్టీ రావాలని నాయకులకు సూచించారు. అనునిత్యం భగవంతుని ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉంది మరలా మరలా ఈ రాష్ట్రానికి కాబోయే సీఎం జగన్ మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు అడగకపోయినా మీ బిడ్డగా ప్రతి సంక్షేమ పథకం మీకు అందే విధంగా చేపడుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ నాలుగు సంవత్సరాల 8 నెలల కాలంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు రెండు లక్షల 70వేల కోట్లు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే మరలా సీఎం కుర్చీలో కూర్చోబెట్టబోతున్నాయి. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు సీఎం కుర్చీలో కూర్చోబెట్టబోతున్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సొంత నిధులతో ఆరు లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణంకు నాలుగు లక్షలతో గుడి దగ్గర మండపం కి నిధులు ఇచ్చారని తెలిపారు. చంద్రమౌళి నగర్ కాలనీకి నిధులు అందించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మొట్టమొదటిగా కోవూరు నియోజకవర్గంలోనే పడుగుపాడు పంచాయతీలో పారిశుద్ధ్య సమస్యలు తాగునీటి సమస్యలు వీధిలైట్లు సమస్యలు ఎలాంటి సమస్యలపై అయినా ప్రజల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. పడుగుపాడు పంచాయతీకి చెందిన టోల్ ఫ్రీ నెంబర్ 9117499117 కు కాల్ చేసి సమస్యలు తెలపండి. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి ప్రజలు సమస్యలపై ఫోన్ చేస్తే తక్షణమే పంచాయతీ పాలకవర్గం చర్యలుచేపడుతుంది అని ఆయన వెల్లడించారు.






Total views : 90600