అధిక ధ్వని స్థాయిల కారణంగా వీడియో గేమర్లలో కోలుకోలేని వినికిడి నష్టం మరియు టిన్నిటస్ ప్రమాదాన్ని కొత్త పరిశోధన కనుగొంది. వీడియో గేమర్లు కోలుకోలేని వినికిడి లోపం లేదా టిన్నిటస్కు గురయ్యే ప్రమాదం ఉందని కొత్త అధ్యయనం చూపిస్తుంది.
వినోద వ్యాపారంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశాలలో వీడియో గేమింగ్ ఒకటి. అయినప్పటికీ, దాని పెరుగుతున్న ప్రజాదరణ ప్రజల శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై దాని ప్రభావం గురించి ఆందోళనలను కూడా పెంచింది. ఇప్పుడు, కొత్త పరిశోధన అధిక ధ్వని స్థాయిల కారణంగా వీడియో గేమర్లలో కోలుకోలేని వినికిడి నష్టం మరియు టిన్నిటస్ ప్రమాదాన్ని కనుగొంది.
50,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులతో కూడిన BMJ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ప్రచురించబడిన సమగ్ర సమీక్ష పత్రం , గేమింగ్లో ధ్వని స్థాయిలు తరచుగా సురక్షిత పరిమితులకు సమీపంలో లేదా మించిపోతున్నట్లు కనుగొంది. గేమింగ్ నుండి ధ్వని స్థాయిలు గేమింగ్ సెంటర్లలో 80-89 డెసిబెల్స్ (dB) వరకు చేరుకుంటాయి మరియు ఇంపల్స్ సౌండ్లు, గేమ్ప్లే టచ్ సమయంలో 119 dB కంటే ఎక్కువ ఉండే సమయంలో పేలుళ్లు ఒక సెకను కంటే తక్కువగా ఉంటాయి. ఇవి సురక్షితమైన ఎక్స్పోజర్ పరిమితులను మించిపోయాయి, ఒక పత్రికా ప్రకటన వివరించింది.
cvr telugu
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ కోడి కత్తి శ్రీను ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలంటూ టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఒకరోజు ఆమరణ నిరాహార దీక్ష. దీని పై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం ఎస్సీ అయిన దళిత బిడ్డ కోడి కత్తి శ్రీను ను జైల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి పైసాచిక ఆనందం పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో దళితులపై అనేక రకాల దాడులు చేసిన ప్రభుత్వ ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సాక్ష్యం చెప్పడానికి వచ్చే సమయం కూడా కేటాయించక పోవడంతో న్యాయస్థానం కూడా ఆలోచన చేయాలి. కోడి కత్తి శ్రీనును జైలు నుంచి విడుదల చేసేంతవరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఒక దళిత బిడ్డను ఐదు సంవత్సరాల నుంచి జైల్లో పెట్టడం పూర్తిగా ప్రభుత్వ కుట్ర పూరిత చర్య. న్యాయం కోసం కోడి కత్తి శీను, తల్లి సోదరుడు నిరవదిక దీక్ష చేయడంపై తెలుగుదేశం పార్టీగా మా మద్దతు తెలియజేశాం. జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు తాడేపల్లి ప్యాలెస్ వద్దకు తన బాధను విన్నవించుకుందాం అని వెళ్తే లేడీ కానిస్టేబుల్ తో దుర్భాషలాడి బయటకు గెంటివేశారని విమర్శించారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డి కి లేదని తెలిపారు.
విజయవాడ బందర్ రోడ్డులో ఏర్పాటు చేసిన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుమారు 4000 మంది పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిను స్టేట్ ఇన్ఫెక్షన్ కంట్రోలర్ టీం అధికారులు డాక్టర్ సారధి, డాక్టర్ సందీప్ నేతృత్వంలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వైద్యులను, అక్కడ సిబ్బంది ను రోగులకు అందిస్తున్న సేవలు, ముఖ్యంగా సిబ్బంది ఇన్ఫెక్షన్ పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. క్యాజువాలిటీలో అపరిశుభ్రత ఉండటంతో సిబ్బంది పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించడం ఎంత ముఖ్యమో అక్కడ పని చేసే వైద్యులు, సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు, కుడా అంతే జాగ్రత్త గా ఉండాలన్నారు. ఆసుపత్రి ఆవరణంలో ఎవరికీ కుడా ఇన్ఫెక్షన్స్ సోకకుండ చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, కనులపండుగగా ఈ నెల 22న స్వామి వారి శాంతి కళ్యాణం. భారీ గా తరలి రానున్న భక్తులు. ఈ నెల 22న అయోధ్య రామప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో,అదే తరహాలో కోడూరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కనులపండుగగా జరగనున్నాయి. విశ్వహిందూ పరిషత్, పాంచజన్యగీతాపారాయణ సత్సంగమ్ భక్తులు ఆధ్వర్యంలో శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. వందలాది మంది భక్తులు గీతాపారాయణం, సహస్రనామ పారాయణం గీతా పారాయణం అనంతరం కోడూరు గ్రామంలోని వేంచేసియున్న శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండిశ్రీ సీతారాములశాంతి కళ్యాణ పాంగణం వరకు శ్రీ రామ శోభాయాత్ర జరగనున్నది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు తిలకించడానికి సుధీర ప్రాంతాల నుంచి సుమారు 20వేల మంది పైగా హిందూ భక్తులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం భక్తులకు మహా అన్న సమారాధన ఏర్పాటు చేశామని నిర్వాహలు తెలిపారు.
ప్రముఖ వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పెట్టిన కేసుపై సిఐడి విచారణ. గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణ చేపట్టనున్న అధికారులు. రామ్ గోపాల్ వర్మ పెట్టిన (క్రైమ్ నంబర్ 22/2023) కేసులో A6 గా ఉన్న రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ కు 17వ తేదీన అర్ధరాత్రి సమయంలో గుంటూరులో సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేసారు. A5 గా ఉన్న తిరువూరుకు చెందిన బండి శివకేశవ తో పాటు షేక్ ఫిరోజ్ ను ఈ నెల 19న ఉదయం గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి హాజరు కావాలని నోటిసులలో పేర్కొన్నారు. హాజరు కానీ పక్షములో అదుపులోకి తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో పవన్ తో మర్యాదపూర్వకంగా కలవనున్న బాలశౌరి. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల ప్రాంతంలో సంబరాలు చేయనున్న పార్టీ శ్రేణులు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారు ఇవాళ ఉదయం 11 గంటలకు కలవనున్నారు. ఈ సందర్బంగా ఈరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలోని అన్ని మండలాల్లో బాణసంచా కాల్చి సంబరాలు చేయనున్న జనసేన నాయకులు, కార్యకర్తలు, బాలశౌరి గారి అభిమానులు, అనుచరులు. గుంటూరు పట్టణంలోని లాడ్జి సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సాయంత్రం 6 గంటలకు దాదాపు 20 డివిజన్లకు చెందిన నాయకులు కలిసి పెద్దఎత్తున ఎంపీ బాలశౌరి గారికి మద్దతుగా బాణసంచా కాల్చనున్నారు.
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం వెంకట కృష్ణాపురంలో జరిగిన భూ వివాదంలో ఐదుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మొదట ద్వారకా తిరుమల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రధమ చికిత్స అనంతరం ఏలూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ద్వారకాతిరుమల మండలం గుండుగోలనుగుంట గ్రామానికి చెందిన రైతులకు వెంకట కృష్ణాపురం గ్రామానికి చెందిన రైతులకు గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో వెంకట కృష్ణాపురానికి చెందిన వీర వెంకయ్య, శ్రీనివాస్ మరికొందరు గుండుగోలను గుంట గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, సత్యనారాయణ, బాలు, వెంకన్న అనే రైతులపై వివాదాస్పద భూమిలో విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. ఆ దాడిలో బాధిత రైతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హుటాహుటిన ద్వారకాతిరుమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
విజయవాడ, ఆవిష్కరణకు సిద్ధమైన భారీ అంబేద్కర్ విగ్రహం. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా నామకరణ. స్వరాజ్య మైదానం లో 20 ఎకరాల్లో భారీ స్మృతివనం. ఎల్లుండి జగన్ చేతుల మీదగా ప్రారంభం. విగ్రహ ఎత్తు 125 అడుగులు , బేస్ పిల్లర్( బేస్ బిల్డింగ్ ) ఎత్తు 80 అడుగులతో కలిపి 205 అడుగుల అతి భారీ విగ్రహంగా రికార్డుకెక్కనున్న అంబేద్కర్ స్టాట్యూ. 2020 జులై 9 న విగ్రహ ఏర్పాటుకు శంకుస్దాపన. డిల్లి నుండి వచ్చిన డిజైనర్లతో సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా రూపుదిద్దుకున్న అంబేద్కర్ విగ్రహం. విగ్రహం క్రింద భాగంలో మూడు ఫ్లోర్లు ఏర్పాటు. ఒక్కో ఫ్లోర్ లో ఒక్కో భారీ హాల్స్ ఏర్పాటు. గ్రౌండ్ ఫ్లోర్ లో నాలుగు హాళ్లు నిర్మాణం. డిజిటల్ లైబ్రరీ, స్క్రీన్ హాల్ , మ్యూజియం ఏర్పాటు. స్కై లైటింగ్, ఫౌంటెన్ , గార్డెన్ తో ప్రత్యేక ఆకర్షణగా విగ్రహం. 404 కోట్ల భారీ వ్యయంతో నిర్మాణం. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు సీయం జగన్ చేతుల మీదగా విగ్రహావిష్కరణ. అనంతరం స్టేడియంలో భారీ బహిరంగ సభ. ఇప్పటికే విగ్రహావిష్కరణకు, సభకు భారిగా ఏర్పాట్లు చేసిన అధికారులు. లక్షన్నర మంది వీక్షించేలా ఏర్పాట్లు.
తెలుగుదేశం పార్టీ రా కదలిరా కార్యక్రమంలో భాగంగా నేడు వెంకటగిరి పట్టణానికి రానున్న టిడిపి అధినేత చంద్రబాబు. ఈ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా విజయవాడ నుంచి వెంకటగిరి కి రానున్న బాబు. చంద్రబాబు బహిరంగ సభకు సర్వం సిద్ధం చేసిన ఆ పార్టీ శ్రేణులు. తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి భారీగా తరలిరానున్న, టిడిపి, జనసేన పార్టీ శ్రేణులు.