Friday, August 28, 2026
News Navigation
Friday, August 28, 2026
News Navigation

Breaking

Friday, August 28, 2026
Home Crime రైతుల మధ్య భగ్గుమన్న భూ వివాదం..

రైతుల మధ్య భగ్గుమన్న భూ వివాదం..

by Prakash
land issues at dwaraka tirumala

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం వెంకట కృష్ణాపురంలో జరిగిన భూ వివాదంలో ఐదుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మొదట ద్వారకా తిరుమల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రధమ చికిత్స అనంతరం ఏలూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ద్వారకాతిరుమల మండలం గుండుగోలనుగుంట గ్రామానికి చెందిన రైతులకు వెంకట కృష్ణాపురం గ్రామానికి చెందిన రైతులకు గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో వెంకట కృష్ణాపురానికి చెందిన వీర వెంకయ్య, శ్రీనివాస్ మరికొందరు గుండుగోలను గుంట గ్రామానికి చెందిన నాగేశ్వరరావు, సత్యనారాయణ, బాలు, వెంకన్న అనే రైతులపై వివాదాస్పద భూమిలో విచక్షణారహితంగా కర్రలతో దాడి చేశారు. ఆ దాడిలో బాధిత రైతులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హుటాహుటిన ద్వారకాతిరుమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: