కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, కనులపండుగగా ఈ నెల 22న స్వామి వారి శాంతి కళ్యాణం. భారీ గా తరలి రానున్న భక్తులు. ఈ నెల 22న అయోధ్య రామప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో,అదే తరహాలో కోడూరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కనులపండుగగా జరగనున్నాయి. విశ్వహిందూ పరిషత్, పాంచజన్యగీతాపారాయణ సత్సంగమ్ భక్తులు ఆధ్వర్యంలో శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. వందలాది మంది భక్తులు గీతాపారాయణం, సహస్రనామ పారాయణం గీతా పారాయణం అనంతరం కోడూరు గ్రామంలోని వేంచేసియున్న శ్రీ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండిశ్రీ సీతారాములశాంతి కళ్యాణ పాంగణం వరకు శ్రీ రామ శోభాయాత్ర జరగనున్నది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు తిలకించడానికి సుధీర ప్రాంతాల నుంచి సుమారు 20వేల మంది పైగా హిందూ భక్తులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం భక్తులకు మహా అన్న సమారాధన ఏర్పాటు చేశామని నిర్వాహలు తెలిపారు.
కోడూరులో అయోధ్య రామమందిర ప్రతిష్ట మహోత్సవములు
301
previous post






Total views : 90600