రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 30న ఎన్నికలు జరగనున్నాయి. భాగంగా మునుగోడు నియోజకవర్గం లో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఎన్నికల సామాగ్రి అంత ఈరోజు ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళుతుంది. ప్రస్తుతం ఆ ఏర్పాట్లలోనే అధికారులు నిమగ్నమై ఉన్నారు. మునుగోడు నియోజకవర్గం లో మొత్తం 39 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 2,52,648 ఓటర్లు కలరు. పురుషులు 1,26,223
మహిళలు 1,26,421 ట్రాన్స్ జెండర్స్04 ఉన్నారు. మునుగోడు నియోజకవర్గం వ్యాప్తంగా 207 పోలింగ్ ప్రదేశాలు కలవు, 307 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సమస్య ఆత్మక పోలి కేంద్రాలుగా 112 గుర్తించారు. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. మహిళా పోలింగ్ కేంద్రాలు 5, మోడల్ పోలింగ్ కేంద్రాలు 5,యూత్ కేంద్రం 1. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా 30 రూట్స్ ఏర్పాటు చేశారు ప్రతి రూటుకి నలుగురు చొప్పున మొత్తం 1,228 మంది పోలింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. 201 వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మైక్రో అబ్జర్వర్ 71మెంబర్స్,ఎక్స్ సర్వీస్ మెంబర్స్ 51 మెంబర్స్ నియమించారు. నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఐదు అంచల పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మంది పైగా పోలీస్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఈవీఎంలు తీసుకెళ్లి రూట్ బస్సులకు జియో ట్యాబ్లెట్ ఏర్పాటు చేశారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 1300 మంది పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నారు. 550మంది ఎన్నికల నిర్వహిస్తున్న అధికారులు ఉపయోగించుకున్నారు.
elections
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. గత ఎన్నికల వేళ కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయని సీఈవో తెలిపారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్సభ ఎన్నికల వేళ సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ మేరకు ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో.. లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read Also..
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారనీ, ఓటర్ లిస్టు పట్టుకుని ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తూ ఆ లిస్ట్ పై పెయిడ్ అని రాసుకుంటున్నా పోలీసులు పట్టించుకోవడంలేదన్నారు. పోలీస్ కమిషనర్ పూర్తి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నప్పటికీ… కిందిస్థాయి సిబ్బంది మాత్రం బీఆర్ఎస్ తొత్తులుగా మారారు అని అన్నారు.బీజేపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున రాష్ట్రంలోని ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. గత ఎన్నికల వేళ కొన్ని సంస్థలు సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయని సీఈవో తెలిపారు. 2018 అసెంబ్లీ, 2019 లోక్సభ ఎన్నికల వేళ సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ మేరకు ఈ ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో.. లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు సీపీ సందీప్ శాండిల్య వెల్లడించారు. ఇవాళ్టి నుంచి 30వ తేదీ సాయంత్రం 5గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు మూసివేయనున్నట్లు చెప్పారు. ఎన్నికలు ముగిసేవరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల విధుల కోసం భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. 45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3వేల మంది ఇతర శాఖలకు చెందిన సిబ్బంది, 50 కంపెనీల స్పెషల్ పోలీసులు, 375 కంపెనీల కేంద్ర బలగాలు, పక్క రాష్ట్రాలకు చెందిన 23,500 మంది హోంగార్డులు బందోబస్తులో ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమ్ భరత్ ఉదయం 6 గంటల నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఈరోజు చేవెళ్ల మండలంలోని కేసారం, దామరగిద్ద, ఖానాపూర్ గ్రామాలలో కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భీం భారత్ కు పెద్ద ఎత్తున ప్రజలు నీరాజనాలు పలుకుతూ హారతులు ఇస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పుతూ వచ్చే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చేస్తున్న భూదందాలు కానీ, కుటుంబ పాలన కొనసాగిస్తున్నాడని దళితులకు రావలసిన పదవులను సైతం తన కుటుంబమే పొందుతుందని దుయ్యబట్టారు. రంగులు మార్చే ఊసరవెల్లి లాగా కేఎస్ రత్నం కూడా పార్టీలు మారుస్తున్నారని ఆయన చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాంగానే పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని దామరగిద్దలో బస్ డిపోను ఏర్పాటు చేపిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి భీం భారత్ తో పాటు వ్యవహారాల ఇన్చార్జి చింపుల సత్యనారాయణ రెడ్డి చేవెళ్ల సర్పంచ్ శైలజ రెడ్డి, దేవర వెంకటరెడ్డి సున్నం వసంతం షాబాద్ దర్శన్ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్. నియోజకవర్గంలో స్కాములు చేసినవాళ్లు ఉన్నారని, ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఇళ్ల పట్టాల సమస్య, నిరుద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తానని చెప్పారు కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థి శ్రీ గణేష్.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మంత్రి కేటీఆర్ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా.. ప్రభుత్వ భవనాల్లో, ఇంటర్వ్యూలలో, న్యూస్ పేపర్లలో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొంది. మూడు రోజుల పాటు కేటీఆర్ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ భవనమైన టీ హబ్లో విద్యార్థులు, యువతతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. టీ హబ్లో సమావేశంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నికల ప్రచారం చేయడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన కాంగ్రెస్ బృందం పేర్కొంది.
నిరుద్యోగ చైతన్య యాత్ర చెన్నూర్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నది.నిరుద్యోగ చైతన్య యాత్ర సభ్యులకు ఘన స్వాగతం పలికారు చెన్నూర్ ప్రజలు. ప్రొఫెసర్ రియాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా మోసం చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి వెంటనే గద్దె దించాలని పిలుపునిచ్చారు.
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ఇస్రంపల్లి, పుట్టపల్లి, రాజోలి గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ 9 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్న ఆల వెంకటేశ్వర్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ, అక్రమంగా ఇసుక మట్టిని దోచుకోవడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటు వస్తుందని, సంక్షేమ పథకాలు ఆగిపోతాయాని బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కావున ప్రజలు ఎవరు అలాంటివి నమ్మవద్దని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామని, 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, రైతులకు 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు సంవత్సరంలోపు 2 లక్షల ఉద్యోగాలు, పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తుందని తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఓటమి భయం పట్టుకున్నది. కావున డబ్బుల తో ఓట్లు కొనాలని బిఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, బిఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసిన చేసిన దేవరకద్ర నియోజకవర్గంలో 30 వెల మెజార్టీతో గెలవబోతున్నానని మధుసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇస్రంపల్లి, పుట్టపల్లి, రాజోలి గ్రామాలకు బిఆర్ఎస్ చెందిన కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read Also..



Total views : 141768