హైదరాబాద్ లోని రాయదుర్గం పీఎస్ పరిధిలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని, మంటలను అదుపులోకి తెచ్చారు. కేబుల్ బ్రిడ్జి పక్కన ఉన్న నిర్మాణస్య ప్రాంతంలో చెత్తాచెదారం చేరడంతో పాటు ఎండిపోయిన గడ్డి ఇతర మొక్కలు ఉండటంతో, గుర్తుతెలియని వ్యక్తులు సిగరెట్ గాని ఇతర కాల్చిన వస్తువులను అందులో వేయడం వల్ల ఆ చెత్త అంటుకోవడం జరిగిందని ఫైర్ సిబ్బంది పేర్కొన్నారు. పొగలు దట్టంగా రావడంతో పక్కనే ఉన్న ఐ టి సి కోహినూర్ హోటల్ సిబ్బంది స్పందించి సమాచారం ఇవ్వడంతో, సంఘటన స్థలనికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకోచ్చరు.
fire hazard
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. షాట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఆదివారం కావడంతో పెను ప్రమాదం తప్పింది. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా అగ్నిమాపక శకటం లేకపోవడంతో మంటలు ఆర్పేందుకు అవకాశం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేసారు.
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ వద్ద గల కాకతీయ టెక్నో స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన స్థానికులు, స్కూల్ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది. అగ్ని ప్రమాదం సంబంధించిన గదులలో పిల్లలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు అంటున్నారు. పాఠశాలలో ఫైర్ సేఫ్టీ మేజర్స్ లేవని, యాజమాన్యం నిర్లక్ష్యమే అగ్ని ప్రమాదానికి కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Read Also..
Read Also..
పాకిస్థాన్లోని కరాచీ షాపింగ్ మాల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృతిచెందారు. రషీద్ మిన్నాస్ రోడ్డులో ఉన్న ఆర్జే మాల్లో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 8 మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. సుమారు 22 మందిని రక్షించారు. బిల్డింగ్లో నాలుగో ఫ్లోర్ వరకు క్లియర్ చేశారు. అయిదు, ఆరో అంతస్తుల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. తెల్లవారుజామున 6:30కు ప్రమాదం జరిగినట్లు తమకు సమాచారం అందిదన్నారు అగ్నిమాపక శాఖ అధికారులు. ప్రస్తుతం మంటల్ని అదుపు చేశారు.
Read Also..
Read Also..
హైదరాబాద్, నాంపల్లి అగ్ని ప్రమాదంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని సీఎస్కు గవర్నర్ తమిళిసై సూచించారు. ఈ ప్రమాద ఘటనకు గల కారణాలు, తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నాంపల్లిలోని బజార్ఘాట్లోని ఓ బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగి, నాలుగు అంతస్తులకు వ్యాపించాయి. ఈ ఘటనలో నాలుగు రోజుల పసికందు, ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు మండలం పాశమైలారం రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ఈ ఘటనలోనలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. మంటలను అదుపు చేసేందుకు స్థానికులు ప్రయత్నించారు. ఘటన స్థలానికి 2 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. అయితే మంటలు ఆర్పుతుండగా స్థానిక ఫైర్ స్టేషన్ లో పనిచేసే ముగ్గురు ఔట్ out source ఉద్యోగులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎట్టకేలకు మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.
Read Also..
Read Also..
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్నిప్రమాదానికి ముందు ఓ యువకుడు క్రాకర్స్ దుకాణం వద్ద సంచరించినట్లు సీసీ కెమెరాలో గుర్తించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
రాజేంద్రనగర్లో సన్సిటీ వద్ద క్రాకర్స్ దుకాణంలో శనివారం వేకువజామున భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న దుర్గా భవాని ఫుడ్జోన్కూ మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో మరో మూడు దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం నాలుగు దుకాణాల నుంచి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దాదాపు 4 గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Read Also..
Read Also..





Total views : 141690