అదనపు ఆదాయం కోసం సాఫ్ట్ వేర్ ఉద్యోగులు డ్రగ్స్ వ్యాపారుల అవతారమెత్తారు. నలుగురు ఐటీ ఉద్యోగుల నుంచి లక్షా 25 వేలు విలువ చేసే డ్రగ్స్, బైకులను ఎక్సైజ్ STF పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణకు చెందిన నలుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అమీర్ పేటలోని హాస్టల్ లో ఉంటారు. వీరు డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. అయితే ప్రతిరోజూ డ్రగ్స్ కొనుగోలు చేయడం కష్టంగా మారడంతో బెంగుళూరులోని ఒక డ్రగ్స్ వ్యాపారితో సంబంధాలు పెట్టుకుని…డ్రగ్స్ ను కొనుగోలు చేసి.. వాటిని తోటి ఉద్యోగులకు, ఇతరులకు విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. పక్కా సమాచారం తెలుసుకున్న STF బీ టీమ్ CI బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు హాస్టల్ పై దాడి చేసి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులైన ఆదర్శ్, శ్రీజిత్, సంజయ్, డప్పుల అజయ్ లను అరెస్ట్ చేశారు. ఇదే టీమ్ శ్రీనగర్ కాలనీలో గంజాయి అమ్మకాలు చేస్తున్న రవితేజను కూడా అరెస్ట్ చేశారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.తాజాగా తుగ్లకాబాద్లోని ఓ భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.…
- భారత ఘాటింగ్ కోచ్ జస్పాల్ రాణా కన్నుమూత.దిగ్గజ షూటర్, ప్రఖ్యాత కోచ్ జస్పాల్ రాణా కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన.. తుదిశ్వాస విడిచారు. భారత్ స్టార్ షూటర్ మను బాకర్ ఈయన కోచింగ్లోనే రాటుదేలిన సంగతి విదితమే. ISSF వరల్డ్ కప్లో భాగంగా…
- పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..పశ్చిమబెంగాల్లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు దహనం అయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో వినియోగించిన ఈవీఎంలను కోల్కతా అలీపూర్లోని ప్రభుత్వ భవనంలో అధికారులు భద్రపరిచారు. ఈవీఎంల దహనంపై…
- మీనాక్షీ నటరాజన్కు సుప్రీంకోర్టు షాక్..సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్కి చుక్కెదురైంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మీనాక్షి పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఆర్వో నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. మీనాక్షి పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. మీనాక్షి…
- పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.రష్యాతో భారత్ కొనసాగిస్తున్న ఇంధన, వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి గట్టిగా సమాధానం ఇచ్చారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ను ప్రశ్నించే ఐరోపా దేశాలు, తమ విక్రయించిన ఆయుధాలు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 141186