కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో నిలిపి ఉంచిన లారీల్లో దొంగలు డీజిల్ చోరీకి పాల్పడ్డారు. ఓ రైస్ మిల్ ముందర నిలిపి ఉంచిన నాలుగు లారీల్లోని డీజిల్ చోరీ అయినట్లు గుర్తించారు. ఉదయం అక్కడికి వచ్చిన హమాలీలు లారీల డీజిల్ ట్యాంక్ మూతలు తెరిచి ఉండటాన్ని గమనించి యజమానులకు తెలిపారు. ఇటీవల కాలంలో కేశవపట్నం పరిసర ప్రాంతాల్లో ఇలాంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండడంతో ప్రజలు వారి వాహనాలను బయట నిలిపి ఉంచేందుకు జంకుతున్నారు.
Karimnagar
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ మేరకు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. అత్యవసర పనుల కారణంగా అమిత్ షా పర్యటన రద్దయిందని తెలిపారు. ఆదివారం మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్లలో నిర్వహించాల్సిన సమావేశాలు రద్దయ్యాయి. బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా పర్యటన రద్దయినట్లుగా వార్తలు వస్తున్నాయి. బీహార్లో నితీష్ కుమార్ I.N.D.I.A. కూటమికి గుడ్బై చెప్పి బీజేపీ వైపు అడుగులు వేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది.
కరీంనగర్ లో అక్రమ భూ దందాలతో సంబంధం ఉందనే కారణం తో కార్పొరేటర్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గత నెల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రజా దర్బార్ లో ఫిర్యాదు చేసిన రాజిరెడ్డి అనే వ్యక్తి. వన్ టౌన్ పోలీసుల అదుపులో భగత్ నగర్ 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములు, చీటి రామారావు,నిమ్మశెట్టి శ్యాం. కరీంనగర్ వన్ టౌన్ ఐపిసి 447,427 సెక్షన్ల క్రింద కేసు నమోదు.
కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయంలో ఉన్న చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ పేరును ప్రభుత్వం మార్చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. గత ప్రభుత్వం 2019 లో చిల్డ్రన్స్ పార్క్ కి కృష్ణమనేని వెంకట్రామారావు ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ గా పేరు పెట్టి జీవోను జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ పేరును మార్చుతూ రవాణా శాఖ లో జీవో ను జారీ చేసింది. జువ్వాడి చొక్కా రావు ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుగా మార్పు చేసింది.
కరీంనగర్ జిల్లాలో ఎల్ఎండిలోని ఇరిగేషన్ కార్యాలయంలో కాళేశ్వరం, మెడిగడ్డ ప్రాజెక్టులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు విజిలెన్స్ ఎస్పీ రమణారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బ్లాక్ వన్ బ్లాక్ టు ఆఫీసుల్లో ఉన్న ఫైల్స్ ను తనిఖీలు చేశారు. అకస్మాత్తుగా ఎల్ఎండి లో ఎస్సారెస్పీ ఆఫీసులకు సంబంధించి తనిఖీలు చేస్తుండడంతో చుట్టుపక్కల పరిణామాలు ఉత్కంఠగా మారింది. తనిఖీల తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు ఎస్పీ రమణారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీ బహిరంగ ఆరోపణలు చేస్తున్నాయి. ఈ సందర్భంలో ఈ తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే కౌటింగ్కు అన్నీ ఏర్పాట్లు పూర్త చేశారు అధికారులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను 14 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించనున్నారు. కౌటింగ్ కేంద్రం వద్ద మూడంచెలతో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంకా కొన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానున్న సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లపై స్ట్రాంగ్ రూమ్ ల నుంచి మా కరస్పాండెంట్ సత్యనారాయణ తాజా సమాచారం అందిస్తారు
నేటితో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న క్రమంలో అభ్యర్థుల్లో టెన్షన్ పీక్స్కు చేరుకుంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. ఈసారి తనను గెలిపించకపోతే భార్యా, బిడ్డతో కలిసి ఉరివేసుకుంటానని వేడుకున్నారు. చంపుకుంటారో, సాదుకుంటారో మీ ఇష్టమని హాట్ కామెంట్స్ చేశారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడతాయని, ఫలితాలలో తనను గెలిపిస్తే జయయాత్ర, ఓడితే మరుసటి రోజు శవయాత్ర అని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఒక్క సారి తనకు అవకాశం కల్పించాలని 30వ తేదీన కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Read Also..
Read Also..
నవంబర్ 30న పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి సి.హెచ్.మధుమోహన్ అన్నారు.
పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లపై పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి సి.హెచ్. మధుమోహన్ పత్రికా సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి మధుమోహన్ మాట్లాడుతూ….. నవంబర్ 28న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగిస్తుందని, ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం పెద్దపల్లి నియోజక వర్గంలో పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు నుంచి అనగా నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ పాటించాలని తెలిపారు.
స్థానికేతరులు నియోజకవర్గం విడిచి వెళ్లి పోవాలని, హోటల్లలో, ఫంక్షన్ హాల్ లో ఉండి ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని , సైలెన్స్ పీరియడ్ 48 గంటల వరకు మద్యం షాపులు మూసి వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
సైలెన్స్ పిరియడ్ లో ఎలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్, నాయకుల ఇంటర్వ్యూ, ఎన్నికల చర్చలు, ఫలితాలను ప్రభావితం చేసే వార్తలను మీడియాలో ప్రసారం చేయడానికి వీలులేదని, నవంబర్ 29, 30న పత్రికలలో ఎన్నికలకు సంబంధించిన ప్రకటనల జారీ కోసం ముందస్తుగా జిల్లా కేంద్రంలోని ఎం.సి.ఎం.సి. అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.
నవంబర్ 29న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అప్పగించి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని, పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించామని, అవసరమైన మేర సెక్టార్ అధికారులను నియమించామని అన్నారు.
నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, పోలింగ్ అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి పోలింగ్ సిబ్బంది, ఈవిఎం యంత్రాలు, వివిప్యాట్ లను తరలిస్తారని, నవంబర్ 30న రాత్రి సమయంలో పోలీస్ ఎస్కార్ట్ తో కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎం యంత్రాలు, వివి ప్యాట్లను తరలించడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన మేర భద్రత ఏర్పాట్లు చేశామని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వెలెన్స్ బృందాలు, వీడియో సర్వేలెన్సు బృందాలు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నాయని అన్నారు.
పెద్దపల్లి లో పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అవసరమైన వసతులు కల్పించడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేశామని, త్రాగునీటి సౌకర్యం , ఓటరు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు . పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 575 మంది వృద్దులు, దివ్యాంగుల ఓట్లు ఇంటి నుంచి సేకరించామని అన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 159 లోకేషన్లలో 290 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 32 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, 12 వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సహకారం అందించాలని ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తుల ఉమ మీడియాతో మాట్లాడుతూ, నేను ఎవరికీ హామీ చేయలేదనీ, తల్లిదండ్రులు నిబద్దతతో పెంచారు, అదే విధంగా పెరిగానన్నారు. బిసి బిడ్డ, మహిళకు బీజేపీ టికెట్ ఇస్తే కుట్రలు చేశారనీ ప్రజలకు మేలు చేస్తే తప్పు, ప్రజ నాయకురాలు ఎదగడం తప్పు పట్టారనీ, బీజేపీ పార్టీ ఇటీవలే మహిళల కి 33 పర్సంట్ రిజర్వేషన్ అన్నారు. కనీసం 10 శాతం, 12 శాతం కావడం లేదనీ, 75 ఏళ్లుగా దొరల ప్రాబల్యం నడుస్తుందనీ, ఇక వేములవాడ నుండే దొరల పై పోరాటం కొనసాగుతుందన్నారు. నన్ను నక్సలైట్ అంటున్నారనీ అనాడు దొరల బానిసత్వం విముక్తి పై కోట్లాడిన వాస్తవమే, పార్టీ నాకు అవకాశం ఇవ్వక పోతే బిసి లకు, మహిళలకు ఇక బీజేపీ అవకాశాలు ఉండవనీ, లో నేను కచ్చితంగా పోటీలో ఉంటానని ప్రకటించారు.
దవ సారి నామినేషన్ దాఖలు చేశాను. రాజకీయంగా జన్మనిచ్చి విదేశాల్లో గుర్తింపు నిచ్చింది. సిరిసిల్ల ప్రజల ప్రజా ప్రతినిదిగా చెప్పుకోవడానికి గర్వ పడుతున్నాను. 15 ఏండ్ల గా అవినీతి రహితంగా పని చేసినం సిరిసిల్ల ముఖ చిత్రం మార్చిన పల్లెలు పచ్చ బడ్డాయి. వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్న మీ బిడ్డగా రాష్ట్ర స్థాయి లో గౌరవం పెరిగింది. అభ్యర్థుల గెలుపు కోసం తిరుగుతున్నాను. గౌరవ ప్రదమైన మెజారిటీతో గెలిపిస్తారాని నమ్ముతున్నగులాబి దండు నాకు అండగా ఉంది. ఇంటింటికి ప్రగతి నివేదిక పంపుతున్న 55 ఎండ్లు అధికారం. ఇచ్చిన ఏమీ చేయని కాంగ్రెస్ కు ఓటు వేస్తారు. సంక్షేమం అభివృద్ధి చేసిన నన్ను గెలిపిస్తారా ఒకే ఒక గొంతుకను అనిచి వేయాలని రాహుల్ గాంధీ వస్తున్నాడు మనకు. మనకు ఏమన్న ఉంటే మనం మనం పరిష్కరించు కుందం ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఒకనాటి సామంత రాజ్యంగా కావాలా కరెంటు కావాలా. కాంగ్రెస్ కావాలా నీళ్ళు కావాలా.. కన్నీళ్లు కావాలా.. స్కాములు కావాలా సబ్బండ వర్ణాల అభ్యున్నతికి బి ఆర్ ఎస్కు ల మత పిచ్చి గాల్లను గెలిపిద్దమ్మ ఆలోచించండి. జిల్లా తెచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం నేతన్నల తలరాతలు మార్చాం ప్రలోబాలకు లొంగీ పతే ఆగం ఐతం గతంలో తప్పు చేస్తే మళ్ళీ 50 ఎండ్లు బడపడ వలసి వస్తది మళ్ళీ డిల్లీ మొచేతు నీళ్ళు తాగే పరిస్తితి వస్తది. సిరిసిల్ల ప్రజలు చైతన్య వంతమైన ప్రజలు సిరిసిల్ల ప్రజల కోసం పనిచేసిన నన్ను మళ్ళీ భారీ మెజారిటీతో గేలిపిస్తారని విశ్వాసం ఉంది.





Total views : 91124