సకల జనుల విజయ సంకల్ప సభా హైదరాబాద్ పాతబస్తీలో గౌళిపుర డివిజన్ బీజేపీ లీడర్ జితేందర్ ఆధ్వర్యం లో సుధ టాకీస్ ఎదురుగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం లో చార్మినార్ నియోజక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి మేఘ రాణి , బహదూర్ పుర బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి , చంద్రయాన్ గుట్ట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కౌడి మహేందర్ ల తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నరు. ఈ కార్య్రమానికి ముఖ్య అతిధి గా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వ శర్మ రావటం విశేషం ఆయనకు స్వాగతం పలికి శాలువా వేసి సన్మానించారు అయన సభా ను ఉద్దేశించి మాట్లాడుతూ తెరాసా , కాంగ్రెస్ మరియు mim అన్ని ఒక్కటే విరు పాతబస్తీ లో అభివృద్ధి పేరుతో దోచుకున్నారు ఈ సారి ఎన్నికలో మాకు అధికారం ఇవ్వండి అభివృద్ధి ఏమిటి అనేది చూపిస్తాను అభివృధి కేవలం బీజేపీ వల్లనే సాధ్యం అవుతుంది తెరాసా పాతబస్తీకి మెట్రో ఇవ్వలేదు వారు మాత్రం ఎదగారు ముస్లిం మహిళలకు తలక్ పేరుతో చేస్తున్న దానిని రద్దు చేసింది బీజేపీ నరేంద్ర మోదిగారు, కాశ్మీర్ లో 370 నీ రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం భారత దేశం ప్రగతి పదం లో నడుస్తున్నది దానికి కారణం బీజేపీ ప్రభుత్వం అస్సాం లో 700 మదరసాలు క్లోజ్ చేసి వాటిని స్కూల్స్ గా మార్చటం జరిగింది దాని వల్ల ఇక ముందు ముస్లిం పిల్లలు డాక్టర్లు , ఇంజినీర్ కావటానికి అవకాశాలు మిన్నగా ఉన్నాయి , ఉద్యోగాలు కల్పించింది బీజేపీ మాత్రమే అని అన్నారు.
Kcr
జమీయతుల్ ఉలమా హింద్ – TS మరియు AP చాప్టర్ తరువాతి ఎన్నికల్లో BRS పార్టీకి మద్దతు ప్రకటించి, BRSని బలోపేతం చేయాలని మైనారిటీలకు విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా జమియతుల్ ఉలమా హింద్-టీఎస్, ఏపీ అధ్యక్షులు ముఫ్తీ గయాసుద్దీన్, ప్రధాన కార్యదర్శి ముఫ్తీ జుబేర్కు మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు ఇబ్రహింపట్నం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ లేక ఆరు గ్యారంటీలను ప్రస్తావిస్తోందని ఆరోపించారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అక్కడ ఏమైందో అందరికి అర్థమవుతోందని అన్నారు. కాంగ్రెస్ కలలు కంటోందని, బీజేపీ సింగిల్ సీటుకే పరిమితం అవుతుందని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు సమానంగా జరుగుతున్నాయని వివరించారు. ఇబ్రహింపట్నం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానని చెబుతున్నమంచిరెడ్డి కిషన్ రెడ్డితో మా ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి చారి ఫేస్ టు ఫేస్.
వికారాబాద్ జిల్లా పరిగి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు. రైతు రుణమాఫీ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కాలేదు అని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు. మాట్లాడుతున్నారు టెన్ హెచ్పీ మోటర్ చాలు అని టెన్ హెచ్పి మోటర్ వాళ్ళ అయ్యా కొనిపిస్తాడా విమర్శించారు.. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతున్నారు జాగ్రత్తగా ఉండండి. లేదంటే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి. పరిగి ప్రజలు మండలం కావాలని అడిగితే మమ్మదాబాద్ చౌడాపూర్ మండలాలు కొత్తగా చేయడం అలాగే మహేష్ రెడ్డి నా స్నేహితుడి కొడుకు. నా కొడుకుతో సమానం. మీరు మహేష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే నేను పరిగిలో కూర్చొని మీ సమస్యలు తెలుసుకొని తీరుస్తాను. ఇంకా పరిగి నియోజక వర్గ విద్యార్థులకు గాని ఐటి కాలేజీలు గాని పారామెడికల్ కాలేజీతో పాటు బంజారా భవన్ ఇంకెన్నో అభివృద్ధి పథకాలు తెచ్చి పరిగి నీ డెవలప్ చేసే బాధ్యత ఎమ్మెల్యే మహేష్ రెడ్డి కచ్చితంగా తీసుకుంటారు. మహేష్ రెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Read Also…
Read Also…
మంథని చౌరస్తాలో నడిరోడ్డుపై నిల్చుంటా బీఆర్ఎస్ నేతలను వచ్చి నన్ను చంపమను అంటూ పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. మహాముత్తారంలో ఓడేడు సర్పంచ్ బక్కారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసారు. మంథనిలో రౌడీయిజం, గూండాయిజం చేసే సంస్కృతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. పుట్ట మధు గురించి మాట్లాడితే బక్కన్న కు పట్టిన గతే కాంగ్రెస్ నాయకులకు పడుతుందని సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. మంథని నియోజకవర్గంలో శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు.. ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ చేయవద్దా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ను,ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కారు గుర్తు ప్రచారం స్పీడ్ పెంచింది. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డికి ప్రజలు బోనాలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. నియోజకవర్గంలోని తిమ్మాజీపేట మండలంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి నేడు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో గ్రామ ప్రజలు, బిఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంజనేయస్వామి గుడి లేని ఊరు తెలంగాణ పల్లెలో లేదు అలాగే కెసిఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు కూడా ఈ తెలంగాణ పల్లెలో లేదు అంటూ మర్రి జనార్దన్ రెడ్డి ప్రచారంలో ప్రసంగించారు. 30వ తేదీన కారు గుర్తుకు ఓటు వేసి తనను మూడోసారి గెలిపించాలని ఓటర్లను మర్రి జనార్దన్ రెడ్డి కోరారు. పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని మర్రి అన్నారు. ఇదిలా ఉంటే మర్రి జనార్దన్ రెడ్డి సతీమణి మర్రి జమున రాణి బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఇల్లు ఇల్లు తిరుగుతూ ప్రచారం కొనసాగించారు. కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఓటర్లను ఆమె కోరారు. మూడోసారి మరి జనార్దన్ రెడ్డి గెలవడం, కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం, టిఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని వారు తెలిపారు.
ముస్లిం మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మహమ్మద్ అలీ మాట్లాడుతూ…. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. షాదీ ముబారక్ తో నిరుపేద ఆడపిల్లల వివాహానికి చేయూతనిస్తున్నారని,
మైనార్టీ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 50ఏళ్లు పరిపాలించినా ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూసారని, వారి సంక్షేమం కోసం కృషి చేయలేదన్నారు.పెద్దపల్లిలో దాసరి మనోహర్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ముస్లిం మైనారిటీలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న దాసరి మనోహర్ రెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు.
ధరణి తీసేస్తే మళ్ళీ దళారి రాజ్యం వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ భూమాతను ప్రవేశపెడతామని చెబుతోందని.. అది భూమేతే అవుతుందని ఎద్దేవా చేశారు. తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పైలట్ రోహిత్రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. రెండు వందల రూపాయలు ఉన్న పింఛను రూ.2వేలు చేశామన్నారు. రైతుల బాగోగుల కోసం రైతుబంధు ప్రవేశపెట్టామన్నారు. మరోసారి అధికారంలోకి వస్తే రూ.16వేలు రైతుబంధు ఇస్తామన్నారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుభీమా డబ్బులు ఎలా వస్తాయన్నారు. రైతుబంధు సొమ్ము దుబారా అని మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మూడు గంటల కరెంటు సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటున్నారు. అలాంటి కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఓటు వేసి ఆగం కావొద్దన్నారు. రాష్ట్రంలో 3500 తండాలను గ్రామ పంచాయతీలు చేయడంతో లంబాడీ బిడ్డలే సర్పంచులుగా రాజ్యమేలుతున్నారన్నారు. బంజారా గౌరవానికి చిహ్నంగా బంజారాహిల్స్లో బంజారా భవన్ నిర్మించామని చెప్పారు.
Read Also….
Read Also….
కాంగ్రెస్ 50 ఏళ్లుకు పైగా పరిపాలించి మహబూబ్ నగర్ ను వలసల జిల్లాగా మార్చిందన్నారు కేసీఆర్. మహబూబ్ నగర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ఈ విధంగా మాట్లాడారు. 2004లో గెలిచిన కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణకు 33పార్టీలు మద్ధతిచ్చాయని.. ఇక కాంగ్రెస్ కు గతి లేక తెలంగాణ ఇచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ 15 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిందని పేర్కొన్నారు. అంతే కాకుండా 3గంటలు కరెంట్ ఇస్తామని పీసీసీ చీఫ్ అంటున్నాడు. దీన్ని పరిగణలోకి తీసుకొని అయినా రాయేదో.. రత్నమేదో ప్రజలే గుర్తించాలన్నారు. అభ్యర్థి వెనకాల ఉన్న పార్టీ మంచిచెడులు తెలుసుకొని ఓటు వేయాలని సూచించారు. అధికారంలోకి రాగానే పెన్షన్ ను 5వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే కంటివెలుగు పథకం కింద 3కోట్ల మందికి పరీక్షలు చేయించామని తెలిపారు. ప్రజలు ఆత్మగౌరవంతో బ్రతకాలనే ఉద్ధేశంతోనే పెన్షన్లు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు.
Read Also…
Read Also…
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రజల లక్ష కోట్ల డబ్బును గంగపాలు చేశారని తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడంటూ సీఎం కేసీఆర్ పై విరుచుకు పడ్డారు. చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ వచ్చాక ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చాడా..? ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా యువకుల జీవితాలను నాశనం చేశాడంటూ కేసీఆర్ పై మండిపడ్డారు. తనపై జరిగిన ఐటీ రైడ్స్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఏం తప్పు చేశానని ఐటీ అధికారులు సోదాలు చేశారు. పన్నులు సక్రమంగా కడుతున్నందుకా అని ప్రశ్నించారు. పోలీసులతో హౌస్ అరెస్ట్ చేసి ప్రజలకు దూరం చేయాలనే కుట్ర పన్నారంటూ కేసీఆర్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ప్రతి ఒక్కరికీ న్యాయం, మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు. యువతకు భారీగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు.





Total views : 90519