Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Latest News పోలీసులపై ఆగ్రహం…

పోలీసులపై ఆగ్రహం…

by Prakash
MLA Shridhar Babu

మంథని చౌరస్తాలో నడిరోడ్డుపై నిల్చుంటా బీఆర్ఎస్ నేతలను వచ్చి నన్ను చంపమను అంటూ పోలీసుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. మహాముత్తారంలో ఓడేడు సర్పంచ్ బక్కారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసారు. మంథనిలో రౌడీయిజం, గూండాయిజం చేసే సంస్కృతిని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారన్నారు. పుట్ట మధు గురించి మాట్లాడితే బక్కన్న కు పట్టిన గతే కాంగ్రెస్ నాయకులకు పడుతుందని సోషల్ మీడియాలో వార్నింగ్ ఇచ్చిన బీఆర్ఎస్ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. మంథని నియోజకవర్గంలో శాంతియుతంగా ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామన్నారు.. ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ చేయవద్దా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ను,ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రశ్నించారు.

Advertisements

You may also like

Our Visitor

014168
Total views : 79380

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.