ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని స్వదేశానికి తిరిగొచ్చిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఢిల్లీ విమానాశ్రయంలో కన్నీటి పర్యంతమయ్యారు. తనను స్వాగతించేందుకు వచ్చిన అభిమానులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. రెజ్లింగ్ లో వినేశ్ ఫైనల్ కు చేరినా అధిక బరువు కారణంగా పతకానికి దూరమైన విషయం తెలిసిందే. అయితే, వినేశ్ పతకం గెలవకపోయినా అభిమానుల మనసులు గెలుచుకున్నారు. పతకం గెలిచిన క్రీడాకారుడికన్నా ఎక్కువగా అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో పోలీసులు అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది.
ఎయిర్ పోర్ట్ టెర్మినల్ నుంచి వినేశ్ బయటకు రాగానే బ్యాండ్ మేళంతో, పూలమాలలతో తోటి రెజ్లర్లు, కుటుంబ సభ్యులు, అభిమానులు స్వాగతం పలికారు. అది చూసి వినేశ్ కన్నీటిని ఆపుకోవడానికి విఫలయత్నం చేశారు. విమానాశ్రయం బయట కారులో వినేశ్ ను ఊరేగింపుగా తీసుకెళుతుండగా కంటతడి పెట్టారు. దీంతో పక్కనే ఉన్న తోటి రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హుడా వినేశ్ ను ఓదార్చారు. కాగా, ఒలింపిక్స్ లో సెమి ఫైనల్ మ్యాచ్ లో వినేశ్ విజయం సాధించినా 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉండడంతో ఆమెపై వేటు పడింది. సెమీస్ విజయంతో రజతం ఖాయమైనా అధిక బరువు వల్ల పతకం దక్కలేదు. దీనిపై వినేశ్ ఫోగాట్ చేసిన అప్పీలును కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించింది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- 13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం గత పదమూడు సంవత్సరాలుగా సాగుతుండటం స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. 2014లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. ప్రతిరోజూ రైల్వే గేటు…
- ‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో…
- పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో అనిత పర్యటించారు. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చేరుకున్న మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రామచంద్రపురం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి…
- మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో గ్రామకంఠం భూమిని ఆక్రమించి నిర్మించిన ఇళ్లను కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేశారు. భారీ బందోబస్తుతో పోలీసు, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ఈ…
- అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అరకు, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల్లోని పలు గ్రామాలు ఇప్పటికీ కనీస రహదారి సౌకర్యం లేకుండా ఉన్నాయి. మాడగడ పంచాయతీ పరిధిలోని మెచ్చగూడ గ్రామస్తులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 62244