బీఆర్ఎస్ ప్రభుత్వంలో యువతకు అన్యాయం జరిగిందని, కాంగ్రెస్ వచ్చాక ఆరు గ్యారీంటీలను అమలు చేస్తామని.. తెలంగాణలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ప్రియాంక గాంథీ ధీమా వ్యక్తం చేసారు. కేసీఆర్ తనను తాను ప్రత్యేకమైన వ్యక్తిగా అభివర్ణించుకుంటారని.. నాయకుడు అనే వారు ప్రజల కోసం ఆలోచించాలి తప్ప సొంతవాళ్ల కోసం కాదన్నారు. ఇక కేసీఆర్ కు సెలవు ఇప్పించి ఫాంహౌస్ కు పంపించే సమయం వచ్చిందన్నారు. బైబై కేసీఆర్ అంటూ కేసీఆర్ పై సెటైర్ వేసారు.
Rahul Gandhi
ఆదిలాబాద్ సభా వేదికపైకి వచ్చిన అమ్మాయి… కాంగ్రెస్ గ్యారెంటీలు ఆమెతో చదివించిన రాహుల్ గాంధీ
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదిలాబాద్లో నిర్వహించిన సభలో ఓ అమ్మాయి వేదిక పైకి రాగా… ఆమెతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను చదివించారు. అమ్మాయి వేదిక పైకి రాగానే హిందీలో చెప్పగలవా? అని రాహుల్ ఆమెను అడిగారు.. దానికి ఆ అమ్మాయి చెప్పగలనని తెలిపింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను హిందీలో చెప్పాలని సూచించారు. వరలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500 ఇస్తామని, గ్యాస్ సిలిండర్ రూ.500కే ఇస్తామని, మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తామని ఆ అమ్మాయితో రాహుల్ గాంధీ చెప్పించారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడారు. తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కేవలం గ్యారెంటీ మాత్రమే కాదని, కాంగ్రెస్ గెలిచాక వీటిని చట్టాలలా చేస్తామని చెప్పారు. ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్ సమావేశంలోనే వీటిని చట్టాలుగా మారుస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శనివారం తెలంగాణకు రానున్నారు. నాందేడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన ఉదయం11.30 గంటలకు బోధన్లోని సభకు హాజరవుతారు. ఆ తర్వాత నిజామాబాద్, 1.30కు ఆదిలాబాద్ పబ్లిక్ మీటింగ్, సాయంత్రం 3.30 గంటలకు వేములవాడ, రాజన్న సిరిసిల్లా నియోజకవర్గాల్లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అనంతరం హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకుంటారు. రాష్ట్రంలోని కీలక నేతలతో ఎన్నికల పరిస్థితులపై చర్చిస్తారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు (శనివారం) వేములవాడ దద్దరిల్లనుంది. BJP అభ్యర్థి చెన్నమనేని వికాస్రావుకు మద్దతుగా 11AMకు సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రానున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కు మద్దతుగా 2PMకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బహిరంగ సభ జరగనుంది. మరుసటి రోజు (26న) BRS అభ్యర్థి చల్మెడకు మద్దతుగా KCR ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 25న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. మూడు అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రచార సభలలో పాల్గొని రాహుల్ ప్రసంగించనున్నారు. నాందేడ్ నుంచి హెలికాప్టర్ లో 12 గంటలకు బోధన్కు చేరుకోని అక్కడ నిర్వహించే ప్రచార సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్ లో మద్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్కు వెళ్లి అక్కడ సభలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్లో వేములవాడకు బయలుదేరతారు. సాయంత్రం 4 గంటలకు అక్కడికి చేరుకొని అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు. అనంతరం హెలికాప్టర్లో బేగంపేటకు చేరుకుంటారు.
మిమ్మల్ని చూస్తోంటే ఈసారి ఖచ్చితంగా గజ్వేల్ గడ్డపై జెండా ఎగరబోతుందన్న నమ్మకం కలుగుతోంది.రెండుసార్లు కేసీఆర్ ను ఎమ్మెల్యేను చేస్తే… మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచిండు.
కొండపోచమ్మలో మిమ్మల్ని తోసిండు, రంగనాయక్ సాగర్ లో ముంచిండు.రైతుల వడ్లు కొనని కేసీఆర్… ఆయన ఫామ్ హౌస్ లో పండిన వడ్లను కావేరి సీడ్స్ కు క్వింటా రూ.4500లకు అమ్ముకుండు..
కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏమైనా బంగారం పండుతుందా?కేసీఆర్ ను మీరు పాతాళానికి తొక్కాలనుకుంటే.. కామారెడ్డికి పారిపోయిండు. కామారెడ్డికే కాదు.. కన్యాకుమారికి పారిపోయిన ప్రజలు నిన్ను ఓడించి తీరతారు.
ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు ఓటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మ్యాచ్ను వీక్షించేందుకు మోదీ స్టేడియానికి రావడం వల్లే జట్టు ఓటమి పాలైందని ఆయన విమర్శించారు. ఇండియా దాదాపు ప్రపంచకప్ను గెలుచుకుందని కాకపోతే ఓ చెడు శకనం వారిని ఓడిపోయేలా చేసిందని మోదీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీవీల్లో ఈ విషయం చూపించరని కానీ దేశ ప్రజలకు అది తెలుసని అన్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మన జట్టు గెలిచేదేనని అయితే ఓ చెడు శకనం మ్యాచ్కు రావడం వల్ల మనోళ్లు ఓడిపోయారని వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అంతే స్థాయిలో స్పందించింది. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవమానకరమని, ఖండించదగినవని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ మానసిక అస్థిరతకు ఆయన మాటలు అద్దంపడుతున్నాయని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు.
Read Also..
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో 751.90కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్తోపాటు దాన్ని నిర్వహిస్తోన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్కు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది.
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ దిల్లీ, ముంబయి, లఖ్నవూ నగరాల్లో 661.69 కోట్ల రూపాయల ఆస్తులను కలిగి ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. దీంతోపాటు ఏజేఎల్లో ఈక్విటీ షేర్ల రూపంలో యంగ్ ఇండియన్ రూ.90.21కోట్లు కలిగి ఉందని తెలిపింది. మరోవైపు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలతోపాటు ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్లను ఇదివరకే విచారించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది.
Read Also…
Read Also…
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. పదేళ్లు కేసీఆర్కు అవకాశం ఇస్తే.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ కు మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ పరిస్థితిని ఊహించలేమన్నారు. వనపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.తెలంగాణ తీసుకొచ్చామని చెప్పిన వారికి పదేళ్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. మరి అలాంటి కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపై లేదా? భారాసకు మరో అవకాశం ఇచ్చే విషయంలో ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం’’ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
తెలంగాణాలో రేపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. పినపాక, పరకాల, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ ,రాజేంద్ర నగర్ లలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం టీ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో ను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ ఎన్నికల ప్రచారం లో ఖర్గే పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా సినీ నటి, బిజెపి నాయకురాలు విజయశాంతి ఖర్గే సమక్షంలో పార్టీలో చేరనుంది. విజయశాంతికి మెదక్ ఎంపీ స్థానం తో పాటు సముచిత గౌరవం ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.





Total views : 90719