అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 17న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ రోజున ఆయన మూడు బహిరంగ సభలలో పాల్గొంటారు. పాలకుర్తి, వరంగల్, భువనగిరిలలో నిర్వహించనున్న బహిరంగ సభలలో రాహుల్ గాంధీ పాల్గొంటారని ఆ పార్టీ తెలిపింది. రాహుల్ గాంధీ తెలంగాణలో వివిధ తేదీలలో మొత్తం ఆరు రోజుల పాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ వెల్లడించింది. ఒకేరోజు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రి-యాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటనల తేదీలను పార్టీ ఖరారు చేయనున్నట్లు చెబుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో పార్టీల అగ్రనేతల పర్యటనలు ఉండేలా చూస్తున్నారు.
Rahul Gandhi
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అగ్రనేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 17న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ రోజున ఆయన మూడు బహిరంగ సభలలో పాల్గొంటారు. పాలకుర్తి, వరంగల్, భువనగిరిలలో నిర్వహించనున్న బహిరంగ సభలలో రాహుల్ గాంధీ పాల్గొంటారని ఆ పార్టీ తెలిపింది. రాహుల్ గాంధీ తెలంగాణలో వివిధ తేదీలలో మొత్తం ఆరు రోజుల పాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ వెల్లడించింది. ఒకేరోజు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఒకటి రెండు రోజుల్లో ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే పర్యటనల తేదీలను పార్టీ ఖరారు చేయనున్నట్లు చెబుతున్నారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో పార్టీల అగ్రనేతల పర్యటనలు ఉండేలా చూస్తున్నారు.
బాపట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంటా అంజిబాబు మాట్లాడుతూ….రాహుల్ గాంధీ జోఢో యాత్ర తో ప్రజల్లో పూర్తి స్థాయిలో చైతన్య వంతులు అయ్యారు.,రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి చెందుతున్నది అన్న నమ్మకం ప్రజలలో కలుగుతోంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడపకుండా అక్రమ కేసులు పెడుతున్నారు, రేపు తెలుగుదేశం పార్టీది ఇదే బాటలో., కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజల పక్షాన బిజెపి ఎస్సీల వర్గీకరణ బూటకం., మళ్ళీ అధికారంలోకి రావాలని వారి మద్య చిచ్చు పెడుతున్నారు జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తాం
మహేశ్వరం నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి KLR మేయర్ పారిజాత నర్సింహ రెడ్డి ఇంటికి వచ్చి నేను ఇక ముందు నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. నా చెల్లెలు అయిన పారిజాత నర్సింహ రెడ్డి లకు హామీ ఇస్తున్నా వారికి రాహుల్ గాందీ , ప్రియాంక గాంధీ లేదా సోనియా తో మాట్లాడిస్తనని హమీ ఇస్తున్నారు. తప్పకుండా పారిజాత నర్సింహారెడ్డి కి గౌరవ మైన స్థానం కల్పిస్తానని తెలుపుతున్నారు. ఎమ్మెల్యే పోటీ చేసి న తరువాత ఎంపీ కూడా ఇక్కడి నుండి పోటీ చేస్తానని అన్నారు. నాకు ఎక్కడ ఇల్లు లేదు. కేవలం తుక్కుగుడ లో నే ఉన్నది కాబట్టి నేను ఇక్కడ గట్టిగా పోటీ చేసి సభితమ్మ ను ఓడించి తీరుతామని ఆ పోరాటం లో పారిజాత నుండి పూర్తి సహకారం అందుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పకుండా నర్సింహ రెడ్డి మరియు పారిజాత గారికి రాత పూర్వకంగా అధిష్టానం నుండి తెలుప్తని అని అన్నారు. మహేశ్వరం నుండి కాంగ్రెస్ అన్ని చోట్ల నాయకులు కార్యకర్తలు ఏకమై సబితా ఇంద్రారెడ్డి ని ఓడించి తీరుతామని KLR అన్నారు.
రాహుల్ గాంధీపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ బలం రాహుల్ కు తెలియదని. తమ బలాన్ని చూసి ఇందిరాగాంధీనే సలాంకు వచ్చిందన్నారు. రాహుల్ గాంధీకి తామంటే ద్వేషంమని అన్నారు. రాహుల్ గాంధీ సహితులైన సింధియా, జితిన్ ప్రసాద్ వంటి పలువురు బిజెపిలోకి చేరారని. వారంతా డబ్బుల కోసమే బీజేపీలోకి వెళ్లారా అంటూ ప్రశ్నించారు. వారి పైన ఆరోపణలు చేయరు కానీ… తన పైన మాత్రం.. డబ్బుల కోసం పని చేస్తున్నట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను అసదుద్దీన్ ఓవైసీ కావడం.. గడ్డం టోపీతో ఉండడటమే కారణమా అంటూ ప్రశ్నించారు.
ఫోన్లను కేంద్ర ప్రభుత్వం హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నేతలు శశిథరూర్, మహువా మొయిత్రాలతో పాటు పలువురు నేతలు ఇటీవల ఆరోపించారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు కూడా ఈ అలర్ట్ మెసేజ్ వచ్చినట్లు సమాచారం. దీనిపై కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంపై ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంపై హ్యాకింగ్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రతిపక్ష నేతల ఫోన్లలో మాల్ వేర్ చొప్పించేందుకు ప్రయత్నించిందన్నవిషయాన్ని ఎలా నిర్ధారించారని ప్రశ్నించింది. ఆరోపణలకు సంబంధించి ఉన్న ఆధారాలు ఏంటని, వాటిని అప్పగించాలని కేంద్ర ఐటీ శాఖ ఈ నోటీసుల్లో పేర్కొంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కుంగిన మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ఇవాళ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీని రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ఇతరులను అనుమతి ఇవ్వలేదు. బ్యారేజీ కుంగిన పిల్లర్లను రాహుల్ గాంధీ సహా ఇతర నేతలు పరిశీలించారు. ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజి వద్దకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్లను తోసుకుంటూ మేడిగడ్డ బ్యారేజీ వైపునకు కాంగ్రెస్ కార్యకర్తలు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కొల్లాపూర్లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో రాహుల్ మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు నిలిచిపోతుందని ఆరోపిస్తున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులతో సహా అందరికీ రైతు భరోసా కింద రూ.15వేలు అందిస్తామన్నారు. ఉపాధి హామీ కూలీలకు కూడా రూ.12వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు. దిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉన్నా.. ప్రియాంక అనారోగ్యం దృష్ట్యా నేను ఈ పర్యటనకు వచ్చానన్నారు. ఓవైపు సీఎం కుటుంబం.. మరోవైపు తెలంగాణ సమాజం.. నిరుద్యోగులు, మహిళలున్నారన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు తదితరులు సభలో పాల్గొన్నారు.
తమ ఐ ఫోన్లను హ్యకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐఫోన్ సంస్థ హెచ్చరిక మెయిల్ చేసిందని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపించడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఇక ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలు కేసీ. వేణుగోపాల్, పవన్ ఖేడా, సుప్రీయా శ్రీనాథ్ లకు ఆపిల్ కంపెనీ నుంచి హెచ్చరిక మెయిల్ వచ్చిందన్నారు. వీరితో పాటు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శశిథరూర్, రాఘవ్ చద్దా, సీపీఎం నేత సీతారారం ఏచూరీలకు సైతం వార్నింగ్ మెయిల్ వచ్చిందన్నారు. విపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు. ఫోన్ ట్యాపింగ్కు భయపడేది లేదన్నారు.





Total views : 90730