సాతాఫ్రికాతో 4 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నేడు ఇండియా రెండో మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. డర్బన్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో సంజు శాంసన్ 50 బంతుల్లో 107 పరుగులు చేసి రాణించడంతో టీమిండియా 61 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో ‘కీ’ రోల్ పోషించారు. అయితే తొలి మ్యాచ్లో టాప్ ఆర్డర్ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమైంది.
మరో వైపు సౌతాఫ్రికా కీలకమైన ఆటగాళ్లు క్వింటన్ డికాక్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే మరియు తబ్రేజ్ షంషీ లేకపోవడంతో ఇబ్బందులు పడింది. ఫామ్ లేమితో బాధపడుతున్న సాతాఫ్రికా జట్టు వెస్టీండిస్తో సిరీస్ కోల్పోవడంతో పాటు ఐర్లాండ్తో సిరీస్ను డ్రా చేసుకుంది. సౌతాఫ్రికా జట్టు రెండో టీ20లో గెలవాలంటే సీనియర్లు మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్ రాణించాల్సిందే. టీంఇండియాలో ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్లో వరుసగా తడపడటం ఇబ్బందిగా మారింది. అందివచ్చిన అవకాశాలను భారీ స్కోర్లు మలచడంలో ఈ ఓపెనర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ విఫలం అవుతున్నాడు. అయితే తొలి మ్యాచ్లో తిలక్ వర్మ వేగంగా 33 పరుగులు చేసి రాణించాడు.
సూర్య కుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా వంటి ఆటగాళ్లతో కూడిన మిడిల్ ఆర్డర్ మంచి ఆరంభం లభించిన తర్వాత తడబడింది. దీంతో భారత్ కేవలం 36 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. ఒక్క సారిగా మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ కుప్పకూలడంతో ప్రశ్నలు తలెత్తాయి. ఇండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తలో మూడు వికెట్లు రాబట్టి సౌతాఫ్రికాను 141 పరుగుల వద్ద నిలువరించడంలో కీలక పాత్ర పోషించడం భారత్కు అనుకూలంగా మారింది. అర్షదీప్, ఆవేశ్ ఖాన్ బంతితో సౌతాఫ్రికా బ్యాటర్లను ఇబ్బంది పెట్టి స్ట్రాంగ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. దీంతో రెండవ టీ20లో ఎలాగైనా గెలవాలని టీమిండియా భావిస్తోంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్సిగ్నల్.మాజీ మంత్రి కొడాలి నానిపై నమోదైన కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2021లో పంచాయతీ ఎన్నికల సమయంలో నమోదైన కేసులో ప్రాసిక్యూషన్కు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో…
- హిమాచల్ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియ విరిగిపడటంతో ధల్లి… సంజౌలి బైపాస్ను పూర్తిగా మూసివేశారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి. శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…
- అమెరికా: న్యూయార్క్లో కాల్పుల కలకలం.అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కాల్పులు కలకం సృష్టించాయి. కాల్పులకు తెగబడటమే కాకుండా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. నిత్యం రద్దీగా ఉండే మాన్హాటన్ పర్యాటక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం వినిపించడంతో పర్యాటకులు, స్థానికులు…
- అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. అయితే వెంటనే అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయట పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం రేగుపాలెం జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి చెన్నై…
- వర్షం వస్తేనే జంకుతున్న భద్రాద్రి గిరిజన గ్రామాలు.ఆకాశం నల్లటి మబ్బులు కమ్ముకుంటుంటే అన్నదాత ఆనందంతో మురిసిపోతాడు. కానీ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీతారాంపురం పంచాయతీ పరిధిలోని అన్నారం, చింతలపాడుతో పాటు మరో మూడు గిరిజన గ్రామాల ప్రజల గుండెల్లో మాత్రం వణుకు మొదలవుతుంది. వారికి వర్షం అంటే పరవశం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 149926