శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ప్రైవేట్ పిఏగా పనిచేస్తున్న రవి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన రవి నాలుగున్నర ఏళ్ల పాటు తిరుమల దర్శన వ్యవహారాలను నడిపించారు. పిఏ రవి ఇంటి వద్ద ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Telugu News
వాహనదారులకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాలపై నమోదైన పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బళ్లపై ఉన్న పెండింగ్ చలాన్లకు 90 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. టూ వీలర్స్కు 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం రాయితీ ప్రకటించింది. భారీ వాహనాలకు 50 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. పెండింగ్ చలాన్లను ఈ నెల 26 తేదీ నుండి వచ్చే నెల 10వ తేదీ వరకు ఈ చలాన్ వెబ్ సైట్ ద్వారా చెల్లించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని వాహనాలపై చలాన్ల పెద్దఎత్తున పెండింగ్లో ఉండటంతో పోలీసు శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించడంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే. పెండింగ్ చలాన్లపై గతంలో డిస్కౌంట్ ప్రకటించినప్పుడు ప్రజల నుండి మంచి స్పందన రావడంతో ప్రభుత్వం మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకుంది.
పశ్చిమగోదావరిజిల్లా, తాడేపల్లిగూడెం సీవీఆర్ కెమెరామెన్ ఉర్ల బాలకృష్ణ వర్ధన్ పై దౌర్జన్యానికి దిగి ఐడీ కార్డు లాక్కోవడం విషయంలో తమదే తప్పని యూనియన్ ఆసుపత్రి యాజమాన్యం, యూనియన్ ఆసుపత్రి ఎండీ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడం కారణంగా అయన ఫోన్ లో స్పీకర్ ఆన్ చేసి మీడియా ప్రతినిధులకు బహిరంగ క్షమాపణ చెప్పిన వైనం. అయన క్షమాపణ చెప్పడంతో పాటుగా అసుపత్రి వద్ద సిబ్బంది ఎవరైతే కెమెరామెన్ పై దౌర్జన్యం చేసి దుర్బాషలాడారో ప్రతీ ఒక్కరి చేతా క్షమాపణలుచెప్పించిన వైనం. అంతకు ముందు ఆసుపత్రి వద్ద వీడియో తీస్తూ ఉండగా కెమెరామెన్ వర్ధన్ ఐడీ కార్డు లాక్కొని దౌర్జన్యం చేసిన యూనియన్ సిబ్బంది. మూకుమ్మడిగా ఆసుపత్రి సిబ్బంది కెమెరామెన్ పై దౌర్జన్యానికి దిగడమే కాక అక్కడికి వచ్చిన కొందరు రిపోర్టర్లు పైన కూడా దురుసుగా ప్రవర్తించడంతో రేగిన వివాదం. విషయం తెలుసుకున్న మీడియా మిత్రులు పెద్ద ఎత్తున యూనియన్ ఆసుపత్రి వద్దకు చేరుకుని వర్ధన్ కు సంఘీభావం తెలిపి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన వైనం. జిల్లా ఎస్పీ రవి ప్రకాష్, ఆర్డీవో చెన్నయ్య, డీఎం అండ్ హెచ్ వో మహేష్ తదితర జిల్లా అధికారులు దృష్టికి ఆసుపత్రి సిబ్బంది దౌర్జన్యాన్ని తీసుకువెళ్లిన మీడియా మిత్రులు. జిల్లా అధికారులు ఆదేశాలతో హుటాహుటిన ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేస్తున్న మీడియా మిత్రులతో మాట్లాడిన టౌన్ ఎస్సై సురేందర్ రెడ్డి, ఇంచార్జ్ ఎమ్మార్వో శివ శంకర్ తాడేపల్లిగూడెం ఏరియా ప్రెస్ క్లబ్ సభ్యులు ఎపీయూ డబ్ల్యూ జే జిందాబాద్, ప్రెస్ క్లబ్ జిందాబాద్ అని నినాదాలతో హోరెత్తించి ఆందోళన కొనసాగించిన వైనం. అధికారులు సర్దిచెప్పి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని యూనియన్ ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బందితో బహిరంగ క్షమాపణ చెప్పించడంతో సర్థుమణిగిన వివాదం. ఈ ఆందోళనలో పిలుపు ఇవ్వగానే ఆసుపత్రి వద్దకు వచ్చిన పోలీసు, రెవిన్యూ అధికారులు వారికి అదేశాలు ఇచ్చి పంపిన జిల్లా అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన మీడియా మిత్రులు.
ఏపీ హైకోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఐఏను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 6కు వాయిదా వేసింది. దీంతో ఏపీ హైకోర్టు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్ఐఏ ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 15కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది సలీం వాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు శ్రీనివాసరావుకు బెయిల్ రాలేదు. కోడికత్తి ఘటన జరిగినప్పటి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు సైతం శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు సీజేఐకు సైతం లేఖ రాసిన సంగతి తెలిసిందే.



Total views : 92080