గత 21 రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఈరోజు ప్రతివారు ఆఫీసుల్లో ఇళ్లల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మాత్రం రోడ్లపై కూర్చొని భిక్షాటన చేస్తున్నారని, వారు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు బాపట్ల తెలుగుదేశం పార్టీ నాయకుడు మాడా సుబ్రహ్మణ్యం దాతృత్వంతో అంగన్వాడీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారికి సంఘీభావం తెలిపి, వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. నూతన సంవత్సర సందర్భంగా వారికి మంచి రుచికరమైన బిర్యాని తానే స్వయంగా వడ్డించి అంగన్వాడి బాధలను నేను చూస్తూ ఉన్నానని, ఇకనైనా ఈ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిచి మీ డిమాండ్లు నెరవేర్చాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని మాడా సుబ్రమణ్యం అన్నారు.
YCP Government
టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు కు చెందిన తెదేపా నేత చింతల అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి తిరుమల వరకు పాదయాత్రను ప్రారంభించారు. టిడిపి ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ 1200 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టడం చాలా ఆనందదాయకమని అన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన సాగుతోందని, అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి – జనసేన ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందని పేర్కొన్నారు. పాదయాత్ర చేస్తున్న అశోక్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు ఉంది అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. ఎక్కడ చూసినా అరాచకాలు, వైసీపీ నాయకుల దాడులు చూస్తూనే ఉన్నామన్నారు. రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారన్నారు. రాష్ట్రంలో సామాన్యులు ప్రశాంతంగా బ్రతకాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాబోయే ఐదు సంవత్సరాలలో ఆంధ్ర రాష్ట్రంను ప్రపంచ పటంలో చూపించగలరన్నారు.
బాపట్ల ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నించిన అంగన్వాడి కార్యకర్తలను భారీ పోలీసు బలగాలతో అడ్డుకుంటున్న బాపట్ల పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తలకు తోపులాట జరిగింది. ఉదయం మా ముందే బాపట్ల శాసనసభ్యులు కోనా రఘుపతి బయటికి వెళ్లారని, మమ్మల్ని చూసుకుంటూ వెళ్లారు గాని మమ్మల్ని ఏమాత్రం పలకరించి ఎందుకు వచ్చారని అడగలేదని అంటే అంగన్వాడీలు అంత తీసేసారా, ఎమ్మెల్యేకి అంత అహంకారం పనికిరాదని రాష్ట్రంలో వైసిపి శాసనసభ్యులు అందరూ ఇలాగే ప్రవర్తిస్తున్నారని, త్వరలోనే ముఖ్యమంత్రి జగన్కు, వైసీపీ ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతామని అంగన్వాడీలు హెచ్చరించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడని మాజీ మంత్రి, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా అయిదు రోజులుగా డిమాండ్ల సాధన కోసం అంగన్ వాడీలు చేస్తున్న పోరాటానికి శనివారం ఉదయం ఆయన కనేకల్లులో సంఘీభావం ప్రకటించారు. అక్కడ వారి దీక్ష శిబిరానికి ఆ పార్టీ నాయకులతో వెళ్లారు. వారి పోరాటానికి ఆది నుంచి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. రానున్న తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను తీరుస్తుందని భరోసా ఇచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు కూడా స్పష్ఠమైన హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2019లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాల కంటే ఏపీలో అంగన్వాడీలకు మెరుగైన జీతాలు ఇస్తానని నమ్మబలికాడన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన వేతనాలనే ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం ఇస్తోందన్నారు. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా, అంగన్వాడి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడానికి ఎందుకు శ్రద్ధ చూపలేదని కాలవ సూటిగా ప్రశ్నించారు. వారు అడుగుతున్న డిమాండ్లు సహేతుకమైనవి, న్యాయబద్దమైనవి అని ఆయన అభిప్రాయపడ్డారు. వారు నిరసన తెలుపుతుంటే వైసిపి ప్రభుత్వం దుర్మార్గంగా సెంటర్ల తాళాలు పగలగోడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5రోజుల పాటు అంగన్వాడిలు న్యాయబద్దంగా పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి కనీసం చీమ కుట్టినట్లుగా లేకపోవడం బాధ్యతరహితమన్నారు. అంగన్వాడిల సమస్యల్ని తీర్చడానికి చేతకాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమానవీయంగా సెంటర్లను స్వాధీనం చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అంగన్వాడీలకు గ్రాడ్యుటి కల్పించాలి. బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి రేఖ మాట్లాడుతూ.. ఈరోజు రెండో రోజు సమ్మె కొనసాగుతోంది, ప్రధానంగా అంగన్వాడీలకు కనీస వేతనాలు ఇవ్వాలని సమ్మె చేస్తున్నాం. పాదయాత్రలో సీఎం హామీలను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మాకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. కనీసం అంగన్వాడి వర్కర్లకు 26,000 జీతం ఇవ్వాలి, ఆయాలకు15000 జీతం ఇవ్వాలి. కర్ణాటకలో, తమిళనాడులో టిఎ డిఏ బిల్లులు వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానంగా 2015 నుంచి అంగన్వాడీలకు టిఏ బిల్స్ లేవు, మాకు చాలీచాలని జీతాలు ఇస్తూ ఎట్టి చాకిరి చేయించుకుంటూ కూడా సరైన జీతాలు ఇవ్వటం లేదని, అందుకోసమే విధి లేని పరిస్థితుల్లో ఈరోజు అంగన్వాడి సెంటర్లు మూసివేసి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది అంగన్వాడి వర్కర్లు ఆయాలతో సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మాకు న్యాయం చేస్తారని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఉద్యమిస్తామని అన్నారు. ఇప్పటికైనా సీఎం గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకొని రాబోయే ఎలక్షన్లో అంగన్వాడీల ప్రేమాభిమానాలు పొందాలని అన్నారు. ఇప్పటికైనా అంగన్వాడి సమస్యలు సానుకూలంగా స్పందించి మా డిమాండ్స్ పరిష్కారం చేయాలి, లేని పక్షంలో మా యొక్క నిరవధిక సమ్మె కొనసాగుతుందని అన్నారు.
Read Also….
Read Also…
రాజకీయ నాయకులంటేనే పదిమందికి న్యాయం చేసే నాయకులని మనం ఎంతో మందిని చూసి ఉంటాం. అయితే అందుకు భిన్నంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరులో ఓ స్థానిక వైసిపి నాయకుడు ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. అధికారం ఉంది కదా అని.. తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ… ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ పాగా వేసి ఆక్రమిస్తున్నాడు. గత 40 సంవత్సరాలుగా దుత్తలూరు పట్టణం కరెంట్ ఆఫీస్ వెనుక చిన్న పాక నిర్మించుకొని బతుకుతున్న తమను ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కనికరించమని కాళ్లు మొక్కుతున్నా.. దయచూపడం లేదని వాపోతున్నారు. గతంలో కూడా ఇదే నాయకుడు తమ మీద దాడి కూడా చేశాడని కన్నీటి పర్యంతమవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే… సదరు నాయకుడికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కూలికి వెళితే తప్ప డొక్కాడని తమ మీద ప్రతాపం చూపిస్తున్న వైసిపి నాయకుడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఏలూరు పోనంగిలో ఉన్న జగనన్న కాలనీలో భారీ అవినీతి జరిగిందని ఏలూరు టిడిపి ఇన్చార్జి బడేటి చంటి ఆరోపించారు. భారీ వర్షాలకు నీట మునిగిన జగనన్న కాలనీని ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల క్రితం జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేపడతామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గృహం కూడా నిర్మించలేదని ఆయన విమర్శించారు. జగనన్న కాలనీలో అసంపూర్తిగా మొండి గోడలతో నిర్మాణాలు ఉన్నాయని కనీసం రోడ్డు సదుపాయం కూడా లేదని ఆయన అన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణాల పేరుతో డ్వాక్రా మహిళల వద్ద నుంచి 35000 వరకు వసూళ్లు చేసిన కాంట్రాక్టర్ పరారయ్యాడని ఆయన ఆరోపించారు. ఏలూరులో నిర్మించిన కిట్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వకుండా వాటిని పక్కనపెట్టి… జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలు చేపట్టి లబ్ధిదారులకు అందజేస్తామని ప్రజలను మళ్ళీ మోసం చేశారని విమర్శించారు.
తడిసిన ధాన్యాన్ని రంగు మారిందాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ మాగంటి బాబు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెర్కెగూడెం గ్రామంలో మిచాంగ్ తుఫాను కారణంగా వరి పంటను గురువారం టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా రైతాంగం తుఫాను కారణంగా ఎంతో నష్టపోయారని కానీ ప్రభుత్వం ఇప్పటివరకు నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికే వరి రైతుల 40000 పొగాకు రైతులు 1లక్ష, పెట్టుబడులు పెట్టారని కనీసం 10000 దిగుబడి వచ్చే అవకాశం లేదని వివరించారు. పంట పొట్ట దశలో ఉన్నప్పుడు కనీసం నీటినందించక పోవడంతో కొంతమేర దెబ్బతిన్న, తుఫానుతో పూర్తిగా పంట రైతులు నష్టపోయారని వాపోయారు. టిడిపి నిర్మించిన పట్టిసీమ ద్వారా నీటిని తోడుకొని కృష్ణ డెల్టా రైతులకు అందించవలసి ఉన్న అటువైపు దృష్టి సారించలేదని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా నాగార్జునసాగర్ పై రెండు ప్రభుత్వాలు కలిసి నీళ్ల కోసం తోలుబొమ్మలాడారని ఎద్దేవా చేశారు. రైతులను వెంటనే ఆదుకోవాలని లేకపోతే టిడిపి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Read Also..
గాంధీజీ కలలుకన్నా గ్రామస్వరాజ్యం సాధనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. ఏలూరు జిల్లా గణపవరం మండలం అగ్రహగోపవరం గ్రామంలో 43లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామసచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే వాసుబాబు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో జిల్లా మండల కేంద్రాల్లో కేంద్రీకృతమయ్యే ప్రభుత్వ కార్యాలయాలను ప్రజల వద్దకే సేవలు అందేలా గ్రామగ్రామనా సచివాలయాలు ఏర్పాటుచేసి సీఎం నూతన నవశకానికి నాంది పలుకుతున్నారని, గాంధీజీ కలలు కన్నా గ్రామస్వరాజ్యం జగనన్న పాలనలో నెరవేరుతుందని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.
ఏపీ ఆర్థిక పరిస్థితిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పీఎఫ్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం బీజేపీ కార్యాలయంలో పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో మాత్రం జగన్ ప్రభుత్వం అవినీతిమయంగా మారిందని విమర్శించారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికారితపై పురంధేశ్వరి విమర్శలు కురిపించారు. అసలు ఏం అర్హత ఉందని, వైసీపీ నాయకులు సాధికారిత యాత్ర చేస్తున్నారని పురంధేశ్వరి ప్రశ్నించారు. ఇసుక, మైనింగ్, మద్యం అన్ని విషయాల్లోనూ వైసీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. రాష్ట్ర విభజన అన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. సీఎం జగన్ సొంత పాలనను కొనసాగిస్తూ అన్ని వర్గాలను, రంగాలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేవారు. కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పథకంపైనా సీఎం జగన్ స్టిక్టర్లు వేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.




Total views : 90054