ఏలూరు పోనంగిలో ఉన్న జగనన్న కాలనీలో భారీ అవినీతి జరిగిందని ఏలూరు టిడిపి ఇన్చార్జి బడేటి చంటి ఆరోపించారు. భారీ వర్షాలకు నీట మునిగిన జగనన్న కాలనీని ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు సంవత్సరాల క్రితం జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలు చేపడతామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క గృహం కూడా నిర్మించలేదని ఆయన విమర్శించారు. జగనన్న కాలనీలో అసంపూర్తిగా మొండి గోడలతో నిర్మాణాలు ఉన్నాయని కనీసం రోడ్డు సదుపాయం కూడా లేదని ఆయన అన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణాల పేరుతో డ్వాక్రా మహిళల వద్ద నుంచి 35000 వరకు వసూళ్లు చేసిన కాంట్రాక్టర్ పరారయ్యాడని ఆయన ఆరోపించారు. ఏలూరులో నిర్మించిన కిట్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వకుండా వాటిని పక్కనపెట్టి… జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలు చేపట్టి లబ్ధిదారులకు అందజేస్తామని ప్రజలను మళ్ళీ మోసం చేశారని విమర్శించారు.
జగన్ పాలనపై బడేటి చంటి హాట్ కామెంట్స్..
328
previous post





Total views : 89139