Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Telangana కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

by Rama
Krishna Project

కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మాజీ మంత్రి హరీశ్‌రావు చెబుతున్నవి పచ్చి అబద్ధాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 56 రోజుల్లో అప్పగింతకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదని.. అంగీకారం, సంతకాలు జరగలేదని, అందుకు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించేది లేదని ముఖ్యమంత్రితోపాటు తాను స్పష్టంగా తెలియజేశానన్నారు. అయినా బీఆర్ఎస్ నాయకులు పదే పదే పాత ఆరోపణలు చేస్తున్నారని.. కుట్రలు వాళ్లు చేసి.. కాంగ్రెస్‌పై నిందలు మోపేందుకు యత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లలో సరైన వాటా కోసమైతే.. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అన్యాయం జరిగిందన్నారు. 2015లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణకు 551 టీఎంసీలు, ఏపీకి 260 టీఎంసీలు ఇవ్వాలని అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్‌ చేయాల్సి ఉన్నా.. పట్టించుకోలేదు. అప్పటినుంచి 2019 వరకు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల కోటాకు అంగీకరించి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. Read Also..

Advertisements

You may also like

Our Visitor

009375
Total views : 62128

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.