మెదక్ నియోజకవర్గంలోని ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సభలో కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టన పార్టీ కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. 50ఏళ్లు కాంగ్రెస్ పాలించినా నీళ్లు రాలేదన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ భయంకరమైన పరిస్థితులు వస్తాయని తెలిపారు. రైతుబంధును పుట్టించిందే బీఆర్ఎస్ అని రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలంటున్నారన్నారు. ఇక రైతుబంధు ఉండాలా? వాద్దా ? అనేది ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తారని ధరణి పోతే దళారులు, పైరవీకారులు వస్తారని మండిపడ్డారు. ఎన్నికలు రాగానే ఆగమాగం కావోద్దని గత ప్రభుత్వ వైఖరి, ఈ ప్రభుత్వ వైఖరేంటో ఆలోచించి ఓటేయండని సూచించారు.
ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్
367
previous post




Total views : 79300