విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా, బుండిబుగ్యో వైరస్ల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ విజ్ఞప్తి మేరకు పౌరవిమానయాన శాఖ ఈ అప్రమత్తత ఉత్తర్వులను విడుదల చేసింది. భారత్కు వచ్చే ప్రయాణికులు ఇకపై తప్పనిసరిగా హెల్త్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ను సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎయిర్ సువిధ 2.0 పోర్టల్ను పౌర విమానయాన శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయాణికులు తమ ప్రయాణానికి కనీసం 24 గంటల ముందే ఆన్లైన్ పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. గత 21 రోజుల్లో తాము ఏయే దేశాలు… ప్రాంతాలు సందర్శించారనే పూర్తి ప్రయాణ చరిత్రను, అలాగే ప్రస్తుత ఆరోగ్య లక్షణాలను ఈ పోర్టల్లో ఖచ్చితంగా పొందుపరచాలని సూచించింది. ఆన్లైన్లో పూర్తి చేసిన హెల్త్ డిక్లరేషన్ ఫారమ్ను విమానాశ్రయాల్లోని కౌంటర్ల వద్ద సిబ్బందికి తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. వైరస్ దేశంలోకి వ్యాపించకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రయాణికులందరూ ఈ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, ఎయిర్పోర్టుల్లో తనిఖీలకు సహకరించాలని కేంద్రం కోరింది.
భారత్కి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం అలర్ట్.
69




Total views : 180110