Wednesday, September 16, 2026
News Navigation
Wednesday, September 16, 2026
News Navigation

Breaking

Wednesday, September 16, 2026
Home Telangana సమస్యలకు నిలయంగా మారిన వరంగల్ ఎంజీఎం

సమస్యలకు నిలయంగా మారిన వరంగల్ ఎంజీఎం

by Rama
సమస్యలకు నిలయంగా మారిన వరంగల్ ఎంజీఎం

వరంగల్ లోని మహాత్మాగాంధీ మెమోరియల్- MGM ఆసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రిగా పేరు ఉంది. కానీ ఈ ఆస్పత్రికే వైద్య చికిత్స అందించవలసిన పరిస్థితి ఎదురయ్యింది. సమస్యలకు నిలయంగా మారిన వరంగల్ ఎంజీఎం. ఇక్కడ పని చేసే అధికారులు ఒకరి పైన మరొకరు దూషించుకోవడం, చాడీలు చెప్పుకోవడమే తప్ప ఇక్కడికి వచ్చే పేషెంట్స్ కు ఎలాంటి ట్రీట్మెంట్ చేయరు. వారికి మందులు కావాలంటే సగం ఇక్కడ ఇస్తారు సగం బయట తీసుకోమని చెబుతారు. ఒక డాక్టర్ ఉంటే మరొక డాక్టర్ ఉండరు. ఇక్కడ గుండె జబ్బులకు సంబంధించిన డాక్టర్ రెండు రోజులు ఇక్కడ ఎంజిఎంలో చూస్తారు మరో రెండు రోజులు సీకేఎం హాస్పిటల్ లో చూస్తుంటారు

ఈ ఆసుపత్రిలో సరిగా ఏ పరికరాలు పనిచేయవు ముషికాల ఆటలు, పాముల బుసబుసలు, ఎప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు పిల్లల వార్డులో ఏ పరికరాలు పనిచేయవు. మార్చురీ వైపు వెళితే ఆ దుర్వాసనకు కడుపులో పేగులు బయటికి రావాల్సిందే. ముఖ్యంగా ఇక్కడ రైతులు సీజన్ లో వారికి కావలసిన విత్తనాలకు గాని, ఎరువులకు గాని గతంలో ఎప్పుడో చెప్పులు పెట్టుకొని కూర్చునేవారు. కానీ ఈ పెద్ద ఆస్పత్రికి వచ్చే రోగులు అలానే పెట్టుకుని ఉండవలసి దుస్థితి నెలకొంది.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
    హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
  • ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
    ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
  • నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
    ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
  • మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.
    బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్‌–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
  • ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.
    ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్‌ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: