రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లా కేంద్రంలో తాజాగా శుభకార్యాలు జరిగిన పలువురు నాయకుల ఇండ్లకు వెళ్ళి కలిశారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో త్వరలో పదవీకాలం ముగియనున్న సర్పంచ్ ల కుటుంబాలతో కలిసి భోజనం చేశారు. అనంతరం, సర్పంచ్ లకు చేసిన ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ . . . పదవిలో నుండి పోయేముందు కూడా గౌరవంగా పంపించాలని భావనతో ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశాం. పదవులు వస్తాయి, పోతాయి అంతేకాని శాశ్వతం కాదు. పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యం. పదవిలో ఉన్నప్పుడు అన్ని విధాలా మంచిగా పనిచేశారు కాబట్టే, ప్రజలు కెసిఆర్ ముఖ్యమంత్రి కాలేదన్నది జీర్ణించుకోలేక పోతున్నారు. ఓ కవి రాసిన పాట, పల్లే కన్నీరు పెడుతుందోయ్ అనే పాట ప్రభుత్వాన్నే మార్చేసింది. తెలంగాణ లో లాగా ప్రతి పల్లెలో డంప్ యార్డ్, పల్లెప్రకృతి వనం, వైకుంఠధామాలు, ట్యాంకర్ లు, ట్రాక్టర్లు, నర్సరీలు లాంటివి ఏ రాష్ట్రంలో ఉన్నాయో చూపించాలని చాలెంజ్ చేశానన్నారు. సర్పంచ్ లు చాలా కష్టపడి పని చేసి ఓడిఎఫ్ ప్లస్ రాష్ట్రంగా మార్చినందుకు సలాం చేస్తున్నానన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు మన రాష్ట్రానికే 82 అవార్డులు వచ్చాయి. దేశంలోనే 30 శాతం అవార్డులు మన రాష్ట్రానికే వచ్చాయని తెలపడానికి గర్వంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి సంసద్ ఆవాస్ యోజన పథకం లో దేశంలోనే టాప్ ట్వంటీ లో 19 గ్రామాలు మనవే కావడం గొప్ప విషయమని సర్పంచ్ ల పనితీరును కొనియాడారు. పెండింగ్ బిల్లుల సమస్య పై మీ తరుపున ప్రభుత్వం తో మాట్లాడడానికి, గొంతు విప్పడానికి నేను సిద్దంగా ఉన్నానని ధీమాను ఇచ్చారు. దేశంలో చెక్ పవర్ ఉన్నది సర్పంచ్ లకు, రాష్ట్రపతికి మాత్రమే అన్నారు.
ప్రభుత్వాన్నే మార్చేసిన ఆ పాట ఏంటి ?
102
previous post