Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Andhra PradeshEast Godavari ఆలయ అర్చకులపై వైసీపీ నేత దాడి

ఆలయ అర్చకులపై వైసీపీ నేత దాడి

by Rama
YCP Leaders Attack

కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న శివాలయంలో పనిచేస్తున్న అర్చకుల (temple priests) పై వైసీపీకి చెందిన నాయకుడు దుర్భాషలాడటమే కాకుండా వారిపై దాడి (YCP Leaders Attack) చేశారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. సోమవారం శివాలయంలోని అర్చకులు సాయి, విజయ కుమార్లపై వైసీపీ నేత, మాజీ కార్పొరేటర్ సిరియాల చందర్రావు వారిని ఆ గర్భగుడిలో దుర్భాషలాడి కాలుతో తన్నారని దేవాదాయ శాఖ ఆలయ ఈవో రాజేశ్వరరావు, కాకినాడ డివిజన్ దేవాదాయ శాఖ పర్యవేక్షకుడు ఫణీంద్రలకు బ్రాహ్మణ అర్చక సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. తక్షణమే తమపై దాడి చేసిన సిరియాలపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఉన్న స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని బాధితులు సాయి, విజయ్ కుమార్లు తెలిపారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ రాష్ట్ర సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్, అఖిల భారత బ్రాహ్మణ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు.

ఇది చదవండి: 30వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రారంభం..


అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ.
అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు మంత్రి నారాయణ. పనులు ప్రారంభించిన …
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ …
అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.
కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. …

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.