Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh జనసేన పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ

జనసేన పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ

by Rama
vamshi krishna yadhav

విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వంశీకృష్ణ యాదవ్ కు జనసేనాని కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. జనసేన పార్టీలోకి రావడంతో పార్టీ మారినట్టుగా అనిపించడంలేదు. సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తోందని వంశీకృష్ణ వ్యాఖ్యానించారు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానిగానే ఉన్నానని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో, విశాఖలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు, పవన్ కల్యాణ్ ను సీఎంగా చేసేందుకు సర్వశక్తులు ధారపోస్తాను అని తెలిపారు. వంశీకృష్ణ యాదవ్ జనసేనలోకి రావడం పట్ల పవన్ కల్యాణ్ స్పందించారు. వంశీకృష్ణ యాదవ్ చాలా బలమైన నాయకుడు అని కొనియాడారు. స్వల్ప తేడాతో విశాఖ తూర్పు నుంచి ఓడిపోయి, మళ్లీ ఎమ్మెల్సీగా గెలిచారని వివరించారు. ఇప్పుడాయనకు సొంత కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాను అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

018627
Total views : 89042

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.