Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News కాగజ్ నగరంలో జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించారు

కాగజ్ నగరంలో జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించారు

by Rama
కాగజ్ నగరంలో జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించారు

కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క పర్యటించారు.ఈ సందర్బంగా కాగజ్ నగర్ పట్టణంతో పాటు మండలంలోని నాజురూల్ నగర్ లో సుమారు ఇరవై లక్షల అంచనా వ్యవముతో నూతనంగా నిర్మించిన పల్లె దావాఖానాలతో పాటు జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఒక్క కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.అనంతరం స్థానిక మోర్కెట్ కమిటీ కార్యాలయ అవరణలో కోటి రూపాయలతో నిర్మించిన మిషన్ భగీరథ రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్దే లక్షయంగా తమ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు.ఆదివాసుల జిల్లా అభివృద్ధిలో వెనకబడటానికి గత పాలకుల నిర్లక్ష్యమే అన్నారు.జిల్లా అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పాటుపడాలని అన్నారు.గతంలో సాగు చెసుకున్న పోడు రైతుల విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.ఇక మున్ముందు ఎవరు కూడా అటవీ సంపదను హరించకుండా అటవుల సంరక్షణకు కృషి చెయ్యాలని అన్నారు.

FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS

  • ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.
    మెక్సికోలో ఫిఫా ప్రపంచకప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో…
  • ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.
    అమెరికా, ఇరాన్‌ల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి…
  • ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.
    ములుగు జిల్లా సోమలగడ్డ వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు.…
  • చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.
    ఈ మ్యాచ్ 20వ ఓవర్‌లో మాత్రమే ముగిసినా, అసలు విజయానికి పునాది శ్రీలంక ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలో మరియు అనంతరం బ్యాటింగ్ పవర్‌ప్లేలో పడింది. చివరి 5 ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన వెస్టిండీస్, తర్వాత తొలి 6…
  • పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.
    పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి, కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

023121
Total views : 141028

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.