పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్థానిక 20 వ వార్డ్ లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వ పాలనలో సామాన్య ప్రజలు పడుతున్న బాధలను కష్టాలను అడిగి తెలుసుకొని వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. చదలవాడ అరవింద్ బాబు కామెంట్స్…. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీతి నిజాయితీగల మనిషి అని. యువతకి రైతులకి మంచి భవిష్యత్తు కావాలి అంటే అది బాబు వల్లే అవుతుందని అన్నారు.. నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు,సంక్షేమం లేదు,ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని అన్నారు.. టిడిపి మేనిఫెస్టో ద్వారా చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగిందన్నారు…మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం తెస్తామని,ఇంట్లో ఎంతమంది మహిళలు అంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మహిళలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
చంద్రబాబు తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం-అరవింద బాబు
429
previous post




Total views : 180857