Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

by CVR NEWS
పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పెండింగ్‌లో ఉన్న బకాయిలను త్వరితగతిన చెల్లించాలని గత ఏడాది ప్రభుత్వానికి, ఫైనాన్స్ సెక్రటరీకి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా బకాయిలు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కింద రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఫైనాన్స్ సెక్రటరీకి గతంలో హైకోర్టు ఆదేశించింది. కోర్టుకు వ్యక్తిగతంగా ఫైనాన్స్ సెక్రటరీ హాజరు కాకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాల్సిందేనని సెక్రటరీని హైకోర్ట్ ఆదేశించింది. అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఆయన హాజరు కాలేకపోయారని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు స్పందిస్తూ.. ‘ అర్ధరాత్రి వరకు కోర్టు హాలులోనే ఉంటాము. వ్యక్తిగత హాజరుకు ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపు ఇచ్చే ప్రసక్తి లేదు. ఏడాది క్రితమే బకాయిలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చాము’..‘కోర్టు ధిక్కరణ కింద నోటిసులు ఇచ్చి ఆరు నెలలు అయింది. ఈ కాలంలోనే పదుల సంఖ్యలో విశ్రాంత ఉద్యోగులు మరణించినట్లు వార్తలు వచ్చాయి. అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్లు ఆర్థిక శాఖ కార్యదర్శికి ముందే తెలుసు కదా ?. ముందే న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉండేది. కోర్టు ధిక్కరణ అంశాలను ఉపేక్షించేది లేదు’ అని స్పష్టం చేసింది.

Advertisements

You may also like

Our Visitor

023262
Total views : 141683

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.