భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. దేశంలో ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. 8 వేల 931 రోజులుగా ఆయన పాలకుడి హోదాలో ఉన్నారు. ఇందులో గుజరాత్ సీఎంగా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. నిన్నటి వరకు ఈ రికార్డు సిక్కిం మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉండేది. 2001 లో గుజరాత్ మఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ… వరుసగా 13 ఏళ్లు అదే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 2014 లో అనూహ్యంగా బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన ఆయన… అఖండ విజయం సాధించారు. అప్పటి నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి కూడా మోదీనే కావడం విశేషం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించి, ఎక్కువకాలం ప్రధానిగా ఉన్న తొలి కాంగ్రెసేతర నేత కూడా మోదీయే. అలాగే ఈ దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన వ్యక్తుల్లో మోదీ రెండో స్థానంలో ఉన్నారు.
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
278
previous post