Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Andhra PradeshKarnool లబోదిబోమంటున్న రైతులు..

లబోదిబోమంటున్న రైతులు..

by Rama
kothi meera

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి గ్రామంలో కొత్తిమీర సాగు చేసిన రైతు లబోదిబోమంటున్నాడు. కొత్తిమీర పంటకు గిట్టుబాటు ధర లేక పండిన పంటను గొర్రెలను మేతగా వదిలాడు. రైతు రాముడు రెండు ఎకరాల్లో కొత్తిమీర పంటను సాగు చేసేందుకు గాను రూ 2లక్షల వరకు పెట్టుబడి పెట్టామని,ఈ పంట 40 రోజుల్లో కోతకు వస్తుందని తెలిపాడు. అదును తప్పితే, ఇక పంట ముదురుతే కొనేందుకు వ్యాపారులు రారని,దీంతో పంట లేతగా ఉన్న సమయంలోనే అమ్మకాలు జరగాలి, కాని గిట్టుబాటు ధర పలకడం లేదని రైతు ఆవేదనా వ్యక్తం చేస్తున్నాడు. కొత్తిమీరను వ్యాపారులు బెడ్లు ప్రకారం కొనుగోలు చేస్తారని, బెడ్ ప్రస్తుతం రూ.100 పలుకుతుండగ ఒక కొత్తిమీరా కట్ట రూ.5 పలుకుతూ,వ్యాపారం రూ. 10వేలు దాటడంలేదని పెట్టుబడి కూడా రావడం లేదు. కూలీలు కూడా గిట్టుబాటు కాకపోవడంతో రైతు రాముడు తాను రెండు ఎకరాల్లో సాగుచేసిన కొత్తిమీర పంటను గొర్రెలకు మేతగా వేశాడు.
తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

Advertisements

You may also like

Our Visitor

014736
Total views : 80971

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.