కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా 25వ తేదీన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లు విజయభేరి సభకు హాజరు అవుతున్నారని ఈ సభను విజయవంతం చేయాలని కాంగ్రేస్ పార్టీ కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని అమనగల్ పట్టణం లో ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సందీప్, కల్వకుర్తి ఎన్నికల పరిశీలకులు మునీర్, టిపీసీసీ అధికార ప్రతినిధి బలాజిసింగ్, టిపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ లతో 25వ తేదీన జరిగే బహిరంగసభ స్థలిని పరిశీలించి మీడియా సమావేశంలో పాల్గొన్న కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన మాట్లాడుతూ అమనగల్ లో జరిగే బారి బహిరంగసభ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కల్వకుర్తి నియోజకవర్గం లోని కల్వకుర్తి, వెల్దండ, అమనగల్, మాడ్గుల తలకొండపల్లి, కడ్తాల్ మండలాలలో అన్ని గ్రామాల ప్రజలు తరలివచ్చి సభను విజవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ విజయభేరి సభ..
298
previous post





Total views : 149573