Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Devotional త్రియుగి నారాయణ్ ఆలయం.. శివ పార్వతులకు వివాహమైన ప్రదేశం

త్రియుగి నారాయణ్ ఆలయం.. శివ పార్వతులకు వివాహమైన ప్రదేశం

by Satya
Triyugi Narayan Temple

శివ పార్వతులు ఈ భూమిపై వివాహం చేసుకున్న ప్రదేశం ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఇక్కడ చాలా జంటలు వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడ ఉంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. చాలా మందికి సరైన జీవిత భాగస్వామితో పాటు వివాహానికి సరైన ప్రదేశం వెతకడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయం. కొంతమంది తమ వివాహాన్ని హోటల్ లో, రిసార్ట్స్ లో, బాంకెట్ హాలులో చేసుకుంటే మరికొంత మంది యువ జంటలు డెస్టినేషన్ వెడ్డింగ్ లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ కొన్ని జంటలు మాత్రం తమ వివాహం ఆధ్యాత్మిక వాతావరణంలో, గొప్ప ప్రాశస్త్యం గల ప్రదేశాల్లో జరగాలని కోరుకుంటారు. అలాంటి జంటలకు సరైన ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న త్రియుగినారాయణ్ గ్రామం. ఈ గ్రామంలో ఉన్న త్రియుగినారాయణ్ ఆలయం విష్ణు మూర్తికి అంకితం చేయబడింది. ఇదే ఆలయంలో కొన్ని యుగాల క్రితం మహా శివుడు, పార్వతి దేవి వివాహం చేసుకున్నట్లు నమ్ముతారు. త్రియుగినారాయణ్ పేరులో “త్రి అంటే మూడు, యుగి అంటే శకము, నారాయణ్ అంటే మహా విష్ణువు మరో నామం” అని అర్ధం. పురాణాలకు సాక్ష్యంగా నిలిచే ఎన్నో చిత్రాలు ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి. ఉదాహరణకు ఈ ఆలయంలో 24 గంటలు ఒక ధుని వెలుగుతూ కనిపిస్తుంది. ఇది శివ పార్వతుల వివాహం సమయంలో వెలిగించినదిగా చెబుతారు. ఇక్కడ నాలుగు నీటి కొలనులు కూడా కనిపిస్తాయి. వీటిలో రుద్ర కుండ్ ను స్నానాల కొరకు, విష్ణు కుండ్ ను ప్రక్షాళన కొరకు, బ్రహ్మ కుండ్ ను తాగేందుకు, సరస్వతి కుండ్ ను తర్పణాల కోసం వినియోగిస్తారు. త్రియుగినారాయణ్ ఆలయాన్ని సందర్శించే యాత్రికులు కేదార్ నాథ్ పర్వతారోహణకు బేస్ క్యాంప్ అయిన గౌరీ కుండ్ ఆలయంలో కూడా నమస్కారం చేస్తారు.
ఆలయ ప్రాముఖ్యత ఏమిటి?
స్థానిక సిద్ధాంతం ప్రకారం ఇక్కడ శివ పార్వతుల వివాహంలో బ్రహ్మ అర్చక సేవలను చేయగా, విష్ణు మూర్తి వధువు సోదరుడిగా చేయాల్సిన అన్ని ఆచారాలను నిర్వహించినట్లు చెబుతారు. ఈ వివాహం జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించడానికి ఆలయంలో బ్రహ్మ శిల అని పిలువబడే రాయి ఉంటుంది. ఇక్కడ పవిత్రమైన అగ్ని నుంచి వచ్చే బూడిదను తీసుకువెళ్లి ఇంట్లో ఒక శుభ్రమైన ప్రదేశంలో ఉంచుకుంటే నూతన జంట సంతోషంగా ఉంటారని నమ్ముతారు.
త్రియుగినారాయణ్ & కేదార్ నాథ్ ఆలయం
నిర్మాణశైలిలో త్రియుగినారాయణ్ ఆలయం ప్రసిద్ధ కేదార్ నాథ్ ఆలయాన్ని పోలి ఉండడం విశేషం. ఆలయ పురాణాల ప్రకారం ప్రస్తుతం ఇక్కడ ఉన్న నిర్మాణం ప్రముఖ సిద్ధ సాధువు, తత్వవేత్త అయిన ఆది శంకరాచార్యచే 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు కధనం.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

019515
Total views : 90910

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.