ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కాల్యలయం వద్ద ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి నిరసన చేశారు. సబ్ రిజిస్ట్రార్లు కార్యాలయాలకు సమయానికి రావడం లేదని ఆయన నిరసనకు దిగారు. ఇంఛార్జి సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ రఫీ విపరీతమైన లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. వైసిపి ఉప ముఖ్యమంత్రి, కడప ఎమ్మెల్యే అంజాద్ భాషా,ఇతర వైకాపా నాయకుల అండ ఉందని మహమ్మద్ రఫీ చెబుతున్నారని, బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న సబ్ రిజిస్ట్రార్ మహ్మద్ రఫీని విధుల నుంచి తొలగించాలని ఎమ్మెల్యే రాచమల్లు డిమాండ్ చేశారు.