Monday, September 14, 2026
News Navigation
Monday, September 14, 2026
News Navigation

Breaking

Monday, September 14, 2026
Home Andhra Pradesh దొంగ పత్రిక ప్రకటన విడుదల….

దొంగ పత్రిక ప్రకటన విడుదల….

by Prakash
Kummetha Kotireddy press conference

పల్నాడు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో తెలుగు యువత పల్నాడు జిల్లా అధ్యక్షుడు కుమ్మెత కోటిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కుమ్మేత కోటిరెడ్డి మాట్లాడుతూ ఏపీలో చదువుకున్న విద్యార్థులను సీఎం జగన్ దారుణంగా మోసం చేశారు అనీ ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము అని ఎన్నికల ముందు చెప్పారు. జాబ్ క్యాలెండర్ సంగతి ఏమో కాని ప్రతి ఏడాది సాక్షి క్యాలెండర్ మాత్రo విడుదల చేస్తున్నారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తే వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాన్నాము అని దొంగ పత్రిక ప్రకటన విడుదల చేస్తారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగులు ఈ రోజు సీఎం జగన్ ని ఒక ద్రోహిగా చూస్తున్నారు. మన రాష్ట్రం నిరుద్యోగ సమస్యలో దేశంలోనే నంబర్ వన్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే చాలా తోలగించారు అని నిరుద్యోగుల ఆత్మహత్యలు చూసైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: