Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home TelanganaAdilabad మందమర్రిలో తీవ్ర విషాదం..

మందమర్రిలో తీవ్ర విషాదం..

by Rama
suicide

మందమర్రిలో విషాదం నెలకొంది. తల్లీకూతుర్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చెన్నై నుంచి వలస వచ్చిన మురుగన్- ధనలక్ష్మి దంపతులు ఇక్కడ పాపడాలు, చెకోడీలు తయారు చేసి విక్రయించడం చేస్తున్నారు. వ్యాపార పని నిమిత్తం మురుగన్ బయటకు వెళ్లిన తర్వాత అర్థరాత్రి సమయంలో ధనలక్ష్మి, కూతురు జీవని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు సిద్దు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నప్పటికీ గమనించలేదు. ఉదయం లేచి చూసేసరికి అక్క,తల్లి శవాలుగా కనిపించడంతో షాక్ కి గురయ్యాడు. కొంతసేపటికి తేరుకొని బంధువులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చిచూసేసరికి విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చే మురుగన్ రాత్రి నుండి ఇంటికి రాకపోవడం, అతని సెల్ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో మురుగన్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisements

You may also like

Our Visitor

042273
Total views : 223693

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: