Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra PradeshEast Godavari కాపులకి రిజర్వేషన్ కల్పించేలా పోరాటం..

కాపులకి రిజర్వేషన్ కల్పించేలా పోరాటం..

by Rama
Reservation

కాకినాడ రూరల్ విద్యుత్ నగర్ వెంకన్నబాబు కళ్యాణ మండపం లో కాపు సద్భావన సంఘం అధ్యక్షులు, రాష్ట్ర కాపు జే.ఏ.సి కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు, కాపు జే.ఈ.సి మెంబర్ లు అర్. ప్రకాష్, ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కాపు కులస్తులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు కార్యచరణ చేయటం లేదని, కాపు లకి రిజర్వేషన్ కల్పించే విధంగా పోరాటం చేయవల్సిన అవసరం ఉందన్నారు. వై.ఎస్. జగన్ అధికారం లో కి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ కి ప్రతి ఏటా 2000 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికీ 5 సంవత్సరాలకు కలిపి 10000 కోట్లు ఇవ్వాల్సి ఉందనీ, జగన్ కాపులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండ ఎన్నికలకు వెళ్తే తగిన గుణపాఠం చెప్పడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. జనవరి 3 వ తేదీన విజయవాడ లో కాపు, ఒంటరి, బలిజ, కులాల జేఏసి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ పై చర్చిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జేఏసి కార్యవర్గ సభ్యులు ఉన్నారని వారి వారి పరిధిలో ఆక్టివ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారని, రాబోయే కాపు తరాల కోసం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో కాపు సభావన సంగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014044
Total views : 78852

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.