Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh అది అబద్ధ ప్రచారమే…

అది అబద్ధ ప్రచారమే…

by Prakash
Kanna Lakshminarayana, ​

సత్తెనపల్లిలో కన్నా క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సత్తెనపల్లి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేస్తాడని ప్రకటించారు. దీనిలో ఎవరికి ఏ విధమైనటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఎవరైనా మాకు టికెట్ వస్తుందని చెప్పుకుంటు తిరిగితే అది అబద్ధ ప్రచారమే, అటువంటి అబద్ధ ప్రచారాన్ని నియోజకవర్గంలో ఎవరు నమ్మ వద్దని అన్నారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు పార్టీ విజయానికి కృషి చేయాలని అచ్చం నాయుడు చంద్రబాబు నాయుడి మాటగా ఈ రోజు చెప్పడం జరిగిందని అన్నారు. చంద్రబాబుకి, లోకేష్ బాబుకి, అచ్చం నాయుడుకి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుకు సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

019235
Total views : 90135

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.