Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh వేధింపులు తాళేలేక యువకుడు ఆత్మహత్య..

వేధింపులు తాళేలేక యువకుడు ఆత్మహత్య..

by Rama
Suicide by hanging

పల్నాడు జిల్లా ప్రవైట్ బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్లు వేధింపులు తాళేలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 7 లక్షల రూపాయలు విజయవాడ లోని ఓ ప్రవైట్ బ్యాంక్ లో లోను తీసుకున్న గొల్ల అజయ్ కుమార్( 25) రుణం క్రమం తప్పకుండా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తూ వచ్చాడు. అజయ్ 88 వేలు నవంబర్ నెలలో కూడా EMI బ్యాంకు వారికి చెల్లించాడు. ఆర్థిక ఇబ్బంది దృష్ట్యా డిసెంబర్ నెలలో EMI చెల్లించకపోవడంతో రోజుకి 40 నుంచి 50 సార్లు కాల్ చేసి EMI కట్టాలఅని బ్యాంక్ రికవరీ ఏజంట్లు తీవ్ర ఒత్తిడికి గురిచేయడంతో, తీవ్ర మానసిక వేదనకు గురైన అజయ్ దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అజయ్ దాచేపల్లి మండలం నడికూడి గ్రామం లో ఘటన చోటుచేసుకుంది. దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

042284
Total views : 223762

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: