Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Political తొలిసారి సచివాలయానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్

తొలిసారి సచివాలయానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్

by Prakash
తొలిసారి సచివాలయానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్

నేడు సచివాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి పవన్ వెళ్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్‌ను పవన్ పరిశీలిస్తారు. అనంతరం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ప్ర‌భుత్వం భ‌ద్ర‌త పెంచింది. ఆయ‌న‌కు వై ప్ల‌స్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్‌, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. పవన్ కల్యాణ్‌కు స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసిన పవన్ రేపు బాధ్యతలను స్వీకరించనున్నారు. సచివాలయంలోని రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 రూమ్‌ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కేటాయించారు. అదే అంతస్తులో జనసేనకు చెందిన మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. పవన్, నాదెండ్ల, కందుల దుర్గేష్ ఛాంబర్లు పక్కపక్కనే ఉండనున్నాయి

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.
    దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చిన షీ జిన్‌పింగ్,…
  • పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.
    పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
  • 22ఏపై బీజేపీ దీక్షలు.
    భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌పై నిర్వహించిన…
  • సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.
    సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
  • భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.
    రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: