Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra Pradesh ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో AP సీఎం పర్యటన

ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో AP సీఎం పర్యటన

by Satya
ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో AP సీఎం పర్యటన

ఈ నెల 25, 26 తేదీల్లో కుప్పంలో AP సీఎం పర్యటన. 25న మధ్యాహ్నం 12.30 నిమిషాలకు పి ఈ ఎస్ మెడికల్ కళాశాలకు హెలికాప్టర్ ద్వారా సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగే బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. 3.30 నుంచి 5 గంటల వరకు పి ఈ ఎస్ ఆడిటోరియంలో చిత్తూరు జిల్లా అధికారులతో సీఎం సమావేశం కానున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటలకు వరకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించనున్నారు. రాత్రికి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. తిరిగి 26 ఉదయం గంటపాటు చిత్తూరు జిల్లా నేతలు కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

ఉదయం 11 గంటలకు ప్రజల నుంచి సీఎం వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మద్యలో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు కుప్పం బూత్ లెవెల్ కమిటీ నుంచి పై స్థాయి అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగున్నర గంటలకు కుప్పం మెడికల్ కళాశాల నుంచి సీఎం చంద్రబాబునాయుడు హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం చేయనున్నారు.

Follow us on : Facebook, Instagram, YouTube & Google News

  • నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది.
    నీట్‌ నిరసన సెగ హైదరాబాద్‌ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్‌సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్‌గాంధీ అరెస్ట్‌ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా…
  • జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.
    జనరిక్‌ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్‌ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్‌ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
  • సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.
    ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
  • రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.
    ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
  • మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.
    హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

042280
Total views : 223738

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: