25 జూన్ 1975 రోజున అప్పటి ప్రధాని ఇందిరగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ విధించిన ఎమర్జెన్సీ దినాన్ని “ప్రజాస్వామ్యానికి చీకటి రోజు” గా జరుపుతూ బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని అర్చన టెక్స చౌరస్తా నుండి గాంధీ పార్క్ వరకు మౌన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాల్వాయి హరీష్ మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ 25 జూన్ 1975 రోజున ఎమర్జెన్సీ విధించడం బాధాకరం అని అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుంది అని బీజేపీ పార్టీ పై దుష్ప్రచారం చేసే కాంగ్రెస్ పార్టీ 75 సార్లు రాజ్యాంగాన్ని మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఎద్దేవా చేశారు .ప్రజాస్వామ్యానికి చీకటి రోజు… బీజేపీ మౌన ప్రదర్శన ర్యాలీ లో ఆనాడు విధించిన ఎమర్జెన్సీ దినాన్ని ఒక్క చీకటి రోజుగా గుర్తిస్తూ ఈరోజు ఎమర్జెన్సీ వ్యతిరేక దినంగా జరూపుకోవడం జరుగుతుంది అని తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
- హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
- జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన నిర్ణయం.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
- అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
- శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 90594