సింగరేణిలో భారీ వర్షాల కారణంగా ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. సింగరేణి వ్యాప్తంగా ఆరు జిల్లాలలో గత ఐదు రోజుల నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ప్రాజెక్టు క్వారీ లలోని పని స్థలాలలో వర్షం నీరు నిల్వ ఉండడంతో ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోయాయి. భారీ యంత్రాలు సైతం మూలకు పడ్డాయి. ప్రాజెక్టులలో ఎక్కడికక్కడ బురద కావడంతో భారీ యంత్రాలు కదలలేని పరిస్థితి నెలకొంది. దీంతో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఉద్యోగులు సైతం ఖాళీగా ఉండే పరిస్థితి నెలకొంది. సింగరేణి వ్యాప్తంగా 23 భూగర్భ గనులు, 19 ఉపరితల ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. అందులో భూగర్భ గనుల నుంచి 20శాతం, ఉపరితల గనుల నుంచి 80 శాతం బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. సింగరేణి వ్యాప్తంగా రోజుకు 1.74 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది.
ఇటీవల వర్షాలతో ఉత్పత్తికి అంతరాయంతో పాటు వివిధ పరిశ్రమలకు సరఫరా చేస్తున్న బొగ్గు రవాణా కూడా స్తంభించిపోయింది. గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో 1 లక్ష 46 వేల 595 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగిందని అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా పూర్తి స్థాయిలో వర్షాలు తగ్గితేనే తిరిగి యధావిధిగా ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు.పుతిన్కు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఢిల్లీలో స్వాగతం పలికారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 తర్వాత రష్యా వెలుపల జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పుతిన్ స్వయంగా హాజరవడం ఇదే తొలిసారి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై…
- పోలాండ్లో రోబోల వినూత్న నిరసన.పోలాండ్ రాజధాని వార్సాలో జరిగిన ఓ వినూత్న నిరసన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 7న హ్యూమనాయిడ్, క్వాడ్రుపెడ్ రోబోలు వీధుల్లో మార్చ్ నిర్వహించాయి. పోలాండ్ డిజిటల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట రోబోలు జెండాలు ఊపుతూ, నినాదాలు…
- నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’.గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్షాప్’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలో వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి