ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దాంతో అధికారులు 10 గేట్లను ఎత్తి 1. 86 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయానికి 4. 02 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. అవుట్ ఫ్లో 2. 50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. డ్యామ్ గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం నీటి మట్టం 883.50 అడుగులుగా ఉంది. ఈ ప్రాజెక్ట్ గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215. 8 టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం జలశయంలో నిల్వ 207. 41 టీఎంసీలుగా ఉంది. ఇక, శ్రీశైలం ప్రాజెక్టులోని కుడి, ఎడమగట్లలోని జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఎగువ నుంచి మరింత వరద కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు జలశయానికి చేరుకుంటున్న వరద నీటిని ఇరిగేషన్ అధికారులు పరిశీలిస్తున్నారు.శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద. మరో వైపు శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం రహదారులన్నీ పర్యాటకులతో సందడిగా మారిపోయాయి. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు శ్రీశైలానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
- అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా దాడులు.తమ దేశంలోని బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో అమెరికా వైమానిక దాడులు చేసినట్లు ఇరాన్ ఆరోపించింది. అయితే, ఏదైనా నష్టం వాటిల్లిందా? అన్న విషయంపై స్పష్టత లేదు. ఇరాన్ ఆరోపణలపై అమెరికా సైన్యం కూడా స్పందించలేదు. ఇరాన్లో ప్రస్తుతం పనిచేస్తున్న…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 196709